వార్నీ.. బీహార్ గెలుపు వెనుక అసలు విషయం ఇదన్నమాట..!!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులని విజయాన్ని అందుకుంది.. జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి. 202 సీట్లతో విజయదుందుభి మోగించింది. ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమి మట్టికరిచింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 35 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ- 91, జేడీయూ- 81 స్థానాల్లో గెలిచాయి. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ వరుసగా అయిదోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిశోర్ చెందిన జన్ సురాజ్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా నితీష్ కుమార్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేసిందని పేర్కొంది. దీని విలువ 14,000 కోట్ల రూపాయలుగా తేల్చింది. ఈ మొత్తం కూడా ప్రపంచ బ్యాంక్ నిధులని స్పష్టం చేసింది. ఈ మొత్తం ఓట్లను గంపగుత్తగా కొన్నారని జన్ సూరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ విమర్శించారు.

ఈ ఏడాది జూన్ నుండి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యేంత వరకు నితీష్ కుమార్ ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలను ఓట్లు కొనుగోలు చేయడానికి ఖర్చు చేసిందని, ఇందులో 14,000 కోట్ల రూపాయలు ప్రపంచబ్యాంక్ నిధులు ఉన్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని మహిళల బ్యాంకు ఖాతాలకు 10,000 రూపాయలు చొప్పున బదిలీ అయ్యాయని అన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పటికీ కూడా ఓటింగ్ జరిగే ముందు రోజు వరకు ప్రజలకు ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు అందుతూనే ఉన్నాయని, నిరుపేద మహిళలను ప్రభావితం చేయడానికి ఈ మొత్తం సరిపోతుందని ఉదయ్ సింగ్ అన్నారు. అధికారంలోకి రావడానికి ప్రజా ధనాన్ని ఓట్లు కొనుగోలు చేయడానికి దుర్వినియోగం చేయకపోతే ఎన్డీఏ ఓడిపోయేదని స్పష్టం చేశారు. ప్రజా తీర్పును డబ్బులతో ప్రభావితం చేశారని మండిపడ్డారు.
జన సూరాజ్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పవన్ వర్మ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. 21,000 రూపాయల వరల్డ్ బ్యాంక్ నిధుల నుండి ఈ మొత్తం మళ్లించారని పేర్కొన్నారు. బీహార్లో ప్రస్తుతం ప్రభుత్వం చేసిన రుణభారం 4,06,000 కోట్ల రూపాయలుగా ఉందని, రోజువారీ వడ్డీకే 63 కోట్ల రూపాయలను కట్టాల్సి వస్తోందని, నితీష్ కుమార్ హయాంలో ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీగా అయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
-
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..












Click it and Unblock the Notifications