ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ గా RBI మాజీ గవర్నర్ శక్తికాంత దాస్
ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం శక్తికాంత దాస్ నియామకం ప్రధానమంత్రి పదవి కాలంతో పాటు..తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కో-టెర్మినస్ గా ఉంటుంది.
మాజీ ఐఏఎస్ అధికారి పీకే మిశ్రా ప్రస్తుతం ప్రధాని మోదీకి మొదటి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. 2019 సెప్టెంబర్ నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు. కాగా ఇప్పుడు శక్తికాంత దాస్ రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇక శక్తికాంత దాస్ ఆర్బీఐ గవర్నర్ గా 2018 నుంచి 2023 వరకు పనిచేశారు. కోవిడ్-19 మహమ్మారి, దేశం యొక్క తదుపరి ఆర్థిక పునరుద్ధరణ తో సహా క్లిష్టమైన ఆర్థిక సవాళ్ల మధ్య భారత్ ముందుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం పదవిని కూడా పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 24,2025 నుంచి మరో ఏడాది పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
-
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications