Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లిస్ట్ రెఢీ చేసిన మోదీ, కౌంట్ డౌన్ మొదలైయ్యింది. ఈ రోజు రాత్రికే విడుదల ?, రింగ్ మాస్టర్ ఎవరు !

లోక్ సభ ఎన్నికలకు ముమ్మరంగా సిద్ధమైన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి, అమిత్ షాలు అనేక రకాలుగా ఎన్నికల వ్యూహాలు రచించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్ర ఎన్నికల కమిటీ (సీఇసీ) ఈ రోజు దేశ రాజధానిలో సమావేశం కానుంది. ఇదే సమావేశంలో కనీసం 125 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను నరేంద్ర మోదీ, అమిత్ షా తదితరులు ఖరారు చేయనున్నట్లు సమాచారం.

గురువారం ఆ పార్టీ తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని బీజేపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి వీవీఐపీ అభ్యర్థులతో పాటు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న కొందరు కేంద్ర మంత్రుల పేర్లు కూడా జాబితాలో చేర్చే అవకాశం ఉందని తెలిసింది. గురువారం రాత్రి బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.

Prime Minister Narendra Modi and Amit Shah finalized the names of 125 BJP MP candidates

ఇతర స్థానాల్లో, గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవలేకపోయిన స్థానాలు కూడా ఉన్నాయని సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ఆరు రాష్ట్రాల కోర్ గ్రూప్ కమిటీలతో సమావేశమైన తర్వాత నేటి కీలక సమావేశం జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆ లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఆ రాష్ట్ర నాయకుల నుండి అభిప్రాయాలను కోరారని తెలిసింది. గురువారం రోజు పార్టీ సీఇసీ సమావేశం కాకుండా జేపీ నడ్డా ఉత్తరప్రదేశ్ బీజేపీ కోర్ గ్రూప్ కమిటీని కలుస్తారు,

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ ఢిల్లీలో గురువారం రాత్రి 7 గంటలకు బీజేపీ హైకమాండ్ తో సమావేశం కానున్నారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులపై బీజేపీ నేతల మేధోమథనం నేటి సమావేశానికి ముందు జరగనుంది. బుధవారం పలు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల గురించి బీజేపీ హైకమాండ్ చర్చలు జరిపింది. అలాగే మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌తో సహా పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలతో హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వేర్వేరుగా సమావేశమయ్యారు.

Prime Minister Narendra Modi and Amit Shah finalized the names of 125 BJP MP candidates

ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ నేతలతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు, అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)కి 400 సీట్లకు పైగా గెలవాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశలకు అనుగుణంగా ఎంపీ సీట్లు ఇచ్చే విషయంలో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని, మొహమాటానికి పోతే మొదటికే మోసం వస్తోందని అమిత్ షా ఇప్పటికే పలువురు నేతలకు తేల్చి చెప్పారని తెలిసింది. మొదటి జాబితాలో తెలంగాణకు చెందిన ఎంపీ అభ్యర్థుల పేర్లు విడుదల అయ్యే అవకాశం ఉందని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+