PM Modi: తల్లి చనిపోయినా విధులకు హాజరైన మోదీ, వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం, క్షమించండి !
అహమ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ కన్నుమూసిన విషయం తెలిసిందే. తల్లి హీరాబెన్ చనిపోయారని తెలిసినా ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా అనుకున్న ప్రకారం విధులకు హాజరైనారు. పశ్చిమ బెంగాల్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్సువల్ గా ప్రారంభించారు. తల్లి హీరాబెన్ చనిపోయారని ఆవేదనతో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ వివిద కార్యక్రమాలను వర్సువల్ గా ప్రారంభించారు.
CM: గాలి జనార్దన్ రెడ్డి ఎఫెక్ట్ ?, బళ్లారికి వందల కోట్ల నిధులు ఇచ్చేసిన సీఎం, డేట్ ఫిక్స్, తరువాత ?
వాస్తవానికి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ లో జరిగే వివిద కార్యక్రమాలకు స్వయంగా హాజరుకావలసి ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ కన్నుమూయడంతో ఆమె అంత్యక్రియలకు హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.
ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ వివిద కార్యక్రమాలను వర్సువల్ గా ప్రారంభించారు. వంద్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. మిమ్మల్ని నేరుగా కలవలేకపోయాను, నా పరిస్థితి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.
couple: రాత్రి ఇంట్లోకి వెళ్లారు, మూడు రోజుల తరువాత దంపతులు ?, ఇంట్లో ఏం జరిగింది ?
కోల్ కతాలో జరిగే జాతీయ గంగా మండలి సవేశాన్ి కూడా ప్రధాని నరేంద్ర మోదీ వర్సువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, కేంద్ర రైల్వేశాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీ గారు మీకు తీరని లోటు జరిగింది, మీరు ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి అంటూ మనవి చేశారు.