మైసూరు మహారాజుకు లేఖ రాసిన మోదీ, మీరు కచ్చితంగా వస్తారని ఎదురుచూస్తున్నా, ఆ సీటు మీదే !
మైసూరు-కొడగు లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, మైసూరు మహారాజుల వంశీయుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడయార్కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాస్తూ మీరు గెలిచి పార్లమెంటుకు రావాలి అని, ఆ రోజు కోసం మేము ఎదురు చూస్తున్నామని ఆకాంక్షించారు. మైసూరులో రాజకీయ కార్యకలాపాలు ఎన్నడూ లేని విధంగా ఊపందుకున్నాయి.
కర్ణాటకలోని మైసూరు-కొడగు లోక్ సభ నియోజకవర్గం ఇప్పుడు బీజేపీకి ప్రతిష్టాత్మక నియోజకవర్గంగా మారింది. మైసూరులో ఎన్నికల ప్రచార హడావుడి కూడా బలంగానే ఉంది. మరోవైపు బీజేపీ అభ్యర్థి యదువీర్కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. యదువీర్కు మోదీ లేఖ రాసి శుభాకాంక్షలు తెలపడం బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నా సహోద్యోగి యదువీర్ అంటూ మోదీ స్వయంగా లేఖ రాశారు.

మీరు లోక్ సభ ఎన్నికల్లో గెలిచి పార్లమెంటుకు వస్తారని నమ్మకం తనకు ఉందని, మీరు గెలుస్తారు అని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో మీరు పార్లమెంటుకు వస్తారన్న నమ్మకం నాకు ఉందని, మీకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని ఆశిస్తున్నానని, మీలాంటి నాయకులు తమ జట్టుకు గొప్ప ఆస్తి అని ప్రధాని నరేంద్ర మోదీ లేఖలో పేర్కొన్నారు. మీలాంటి వారు ప్రజలకు సేవ చెయ్యడానికి రాజకీయాల్లోకి రావడం తనకు సంతోషంగా ఉందని మోదీ తెలపారు.
ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేస్తూ మైసూర్ ప్రభువుల గొప్ప వారసత్వాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళడం అభినందనీయం, సుస్థిర అభివృద్ధి, విద్య పట్ల మీ అంకితభావం స్పష్టంగా కనిపిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ లేఖలో వివరించారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన జీవితాన్ని అందించాలనే మా మిషన్లో ఈ ఎన్నికలు కీలకం. బీజేపీకి వచ్చే ప్రతి ఓటు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతుందని, ఇది ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతుందని మోదీ వివరించారు.

మండ్య ఎంపీ, సినీనటి సుమలత కూడా మైసూరులో తిరుగుతూ ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తూ బీజేపీని బలోపేతం చేశారు. కాంగ్రెస్ కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తుండగా మైసూరు-కొడగు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటాపోటీగా ప్రత్యక్షపోరు నెలకొంది. మొత్తం మీద మైసూరు మహారాజు యదువీర్ ఒడయార్ కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా గట్టిపోటీ ఇవ్వడంతో ఆ నియోజక వర్గం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications