జమిలికి కేంద్రం డెడ్ లైన్ - ఎన్నికలపై బిగ్ స్కెచ్..!!
కేంద్రం అనుకున్న విధంగానే ముందుకు వెళ్తోంది. జమిలి పైన వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. జమిలి బిల్లును అభ్యంతరాల నడుమ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది. ప్రతిపక్షాలు జేపీసీ కోసం డిమాండ్ చేస్తున్న వేళ.. ప్రభుత్వమే జేపీసీ ప్రకటన చేసింది. ఇప్పుడు 31 మందితో ఉభయ సభ ల సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు కానుంది. నివేదిక కోసం డెడ్ లైన్ ఖరారు చేసిన కేంద్రం .. ఎన్నికల నిర్వహణ పైన నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.
31 మందితో కమిటీ
జమిలి ఎన్నికల బిల్లు కోసం కేంద్రం 90 రోజుల గడువు నిర్ణయించింది. సంయుక్త పార్లమెంటరీ కమిటీకి బిల్లును సిఫార్సు చేస్తూనే.. సమయం నిర్దేశించింది. ఇందు కోసం ఉభయ సభల్లోని సభ్యు లకు అవకాశం ఇవ్వనుంది. పార్టీల నుంచి వచ్చిన పేర్లను కమిటీలో నియామకం చేయనున్నారు. స్పీకర్ అధికారికంగా నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి 90 రోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ తో పాటు మనీష్ తివారీ, సుఖ్దేవ్ భగత్, రణదీప్ సూర్జేవాలా పేర్లను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసినట్లు సమాచారం.

పార్టీల ప్రతినిధులుగా
బీజేపీ నుంచి ఎంపీలు రవిశంకర్ ప్రసాద్, నిశికాంత్ దుబే పేర్లును ప్యానెల్ సభ్యులుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీఎంసీ నుంచి ఇద్దరి పేర్లను సిఫార్సు చేసారు. కల్యాణ్ బెనర్జీ, రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే పేర్లు దాదాపు ఖరారయ్యాయి. శివసేన నుంచి మహారాష్ట్ర మాజీ సీఎం షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే, జేడీయూ నుంచి సంజయ్ ఝా తో పాటుగా డీఎంకే నుంచి సెల్వ గణపతి, పీ వీల్స్ పేర్లు జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 31 మంది ఉండే ఈ కమిటీ లో లోక్ సభ నుంచి 21, రాజ్యసభ నుంచి పది మంది ఉండనున్నారు.
90 రోజుల సమయం
జేపీసీకి సంబంధించి సభలో నిర్ణయం జరగటంతో ఈ కమిటీ ఏర్పాటు పైన స్పీకర్ ప్రకటన చేయనున్నారు. జమిలి బిల్లు పరిగణలోకి తీసుకునే అంశం పైన ఓటింగ్ జరిగింది. 360 మంది ఎలక్ట్రానిక్ ఓటింగ్లో కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేసారు. కాగా, మరికొందరు బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటింగ్ చేసారు. ఇక, ఇప్పుడు జేపీసీ తమ నివేదిక ఇచ్చిన తరువాత సభలో చర్చించి.. బిల్లుల ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నించనుంది. ఇక, ఎన్నికల నిర్వహణ పైన సభలోనే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications