శబరిమల కోసం కొత్త చట్టం చేయండి: కేరళ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు, జనవరి 3లోగానే..
న్యూఢిల్లీ: శబరిమల ఆలయ నిర్వహణకు కొత్త చట్టం రూపొందించాలని సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జనవరి 3వ తేదీలోగా కొత్త చట్టం తీసుకురావాలని స్పష్టం చేసింది. కేరళలోని ఇతర ఆలయాలతోపాటు చట్టం తీసుకురావడం సమంజసం కాదని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.

కొత్త చట్టం తీసుకురావాలంటూ..
పండలం రాజ కుటుంబం వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం బుధవారం అయ్యప్ప ఆలయం నిర్వహణ కోసం ప్రత్యేక కొత్త చట్టం తీసుకురావాలంటూ కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఏడుగురు సభ్యుల ధర్మాసనంకు..
అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన సమీక్ష పిటిషన్లై ఇటీవల సుప్రీంకోర్టు విచారించిన విషయం తెలిసిందే. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం సహా ఇతర మతపరమైన అంశాలను ఏడుగురు సభ్యులతో కూడిన విస్తృత ధర్మసనం పరిశీలిస్తుందని గత గురువారం సుప్రీంకోర్టు పేర్కొంది. ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మసనానికి ఈ వ్యవహారాన్ని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

స్టే ఇవ్వకపోవడంతో.. కేరళ ప్రభుత్వం..
కానీ, గతంలో ఇచ్చిన తీర్పుపై ఎలాంటి స్టే విధించలేదు. అయితే, భద్రతా కారణాలరీత్యా 10 నుంచి 50ఏళ్ల లోపు మహిళలను ఆలయంలోకి అనుమతించకుండా కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేగాక, ఆ వయస్సులోపు మహిళలు శబరిమలకు వస్తే వారి రక్షణ తమ బాధ్యతని స్పష్టం చేసింది.

మహిళలను వెనక్కి పంపిస్తున్నారు..
ఈ నేపథ్యంలో శబరిమలకు మహిళలు రాలేదు. వచ్చిన కొందరిని ఆలయంలోకి వెళ్లకుముందే తిరిగి పంపించారు. మంగళవారం కుటుంబసభ్యలతో వచ్చిన ఓ 12ఏళ్ల బాలికను పంబ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కాగా, వార్షిక మండల పూజల నిమిత్తం గత శనివారం శబరిమల ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications