పార్లమెంటులో ఆందోళనలు: మాణికం ఠాగూర్ సహా నలుగురు కాంగ్రెస్ ఎంపీలు సస్పెండ్
న్యూఢిల్లీ: పలు అంశాలపై చర్చను డిమాండ్ చేస్తూ పార్లమెంటులో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. సభలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసనలు, నినాదాలు చేసినందుకు నలుగురు కాంగ్రెస్ ఎంపీలను లోక్సభ నుంచి సోమవారం మొత్తం ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు.
నలుగురు కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, రమ్య హరిదాస్, జోతిమణి, టీఎన్ ప్రతాపన్ సస్పెండ్ అయ్యారు. జూలై 18న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ధరల పెరుగుదల, జీఎస్టీ రేటు పెంపు సమస్యలు రాజ్యసభ, లోక్సభ రెండింటిలోనూ అనేక వాయిదాలకు దారితీశాయి.

సోమవారం, కాంగ్రెస్, టిఎంసి, డీఎంకే విపక్ష సభ్యులు సభలో ధరల పెరుగుదలపై ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేయడంతో లోక్సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.
వారు లేవనెత్తిన సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పీకర్ ఓం బిర్లా వారికి తెలియజేస్తూ.. సభ నడవాలని ప్రజలు కోరుకుంటున్నారని పలుమార్లు చెప్పారు. అయినప్పటికీ, గందరగోళం కొనసాగడంతో, స్పీకర్ బిర్లా మొదట సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. కాగా, వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి కాంగ్రెస్ సహా విపక్షాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. దీంతో వాయిదాలు పడుతూ లోక్సభ, రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications