ఒబామాకు గార్డ్ ఆఫ్ ఆనర్: తొలి మహిళా సైనికాధికారిణిగా అరుదైన అవకాశం
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాని స్వాగతించే అరుదైన అవకాశాన్ని ఒక మహిళా సైనికాధికారిణి దక్కించుకుంది. ఆమె పేరు పూజా ఠాకూర్. వింగ్ కమాండర్గా ఉన్న పూజా ఠాకూర్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా వచ్చిన అమెరికా అధ్యక్షుడికి సలామే శస్త్ర్ నుంచి... సైనిక వందనానికి దగ్గరుండి మరీ తోడ్కోని తీసుకెళ్లింది.
Wing Cmdr Pooja Thakur leads the Guard of Honour in Rashtrapati Bhavan. #TheObamaVisit pic.twitter.com/wKs5iINGAL
— TIMES NOW (@TimesNow) January 25, 2015 ఇలా ఒక అమెరికా అధ్యక్షుడు భారత్ పర్యటనకు వచ్చినప్పుడు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చిన ఏకైక మహిళా అధికారిణిగా రికార్డు సాధించింది. అక్కడినుంచి సైనిక వందనం స్వీకరించే వేదిక వద్దకు ఒబామా చేరుకున్నారు. త్రివిధ దళాధిపతులు కూడా రాష్ట్రపతి భనవ్ వద్ద ఒబామాకు స్వాగతం పలికారు.
ఇరు దేశాల జాతీయగీతాల ఆలాపన పూర్తయిన తర్వాత ముందుగా రాష్ట్రపతి, ప్రధాని, ఆ తర్వాత ఒక్కొక్కరుగా కేంద్ర మంత్రులతో ఒబామా కరచాలనం చేశారు. రాష్ట్రపతి భవన్కు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్రమోడీ తన మంత్రివర్గ సహచరులను పరిచయం చేశారు. ఆ తర్వాత ఒబామా తనతో వచ్చిన ప్రతినిధులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీకి పరిచయం చేశారు.
#ObamaInIndia US President @BarackObama says its a great honour to be back in India
http://t.co/6oHnizfaPT pic.twitter.com/LM6Pcdw84R
— ABP News (@abpnewstv) January 25, 2015 అపూర్వమైన ఆతిధ్యానికి కృతజ్ఞతలు: ఒబామా
అనంతరం అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా మాట్లాడుతూ భారత్లో లభించిన ఈ అపూర్వమైన ఆతిధ్యానికి మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయన మళ్లీ తన 'బీస్ట్' వాహనం ఎక్కి.. మహాత్మాగాంధీకి నివాళులర్పించేందుకు రాజ్ ఘాట్కు బయల్దేరి వెళ్లారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications