ప్రాణాలు తీసిన కారు: 5 గంటల పాటు కారులోనే బాలుడు, మృత్యువాత
పూణె: స్నేహితులతో ఆడుకొంటూ పార్క్ చేసిన కారులో కూర్చొన్న సమయంలో ఆ కారు లాక్ కావడంతో ఆ చిన్నారి ఊపిరాడక చనిపోయిన ఘటన మహరాష్ట్రలో మంగళవారం నాడు చోటు చేసుకొంది.
మహరాష్ట్రలోని పూణెలో కరణ్పాండే అనే ఐదేళ్ళ బాలుడు తన స్నేహితులతో మంగళవారం నాడు ఆడుకొంటున్నాడు. అయితే ఆ సమయంలో ఎండకు తాళలేక అక్కడే పార్క్ చేసిన కారులో కూర్చుండిపోయాడు. అయితే ఆ కారు పొరపాటున కారు లాక్ అయిపోయింది.

ఐదు గంటల పాటు కారులోనే ఆ బాలుడు అలానే కూర్చుండిపోయాడు. కారు లాక్ కావడంతో ఊపిరి ఆడక ఆ బాలుడు కారులోనే ప్రాణాలు విడిచాడు. అయితే కారులో కరణ్ కూర్చున్న విషయాన్ని కూడ అతడి స్నేహితులు గమనించలేదు.
అయితే ఆడుకొనేందుకు వెళ్లిన కరణ్ ఐదు గంటలు దాటినా కానీ ఎంతకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతికారు. అయితే కారులో కరణ్ ఉన్న విషయాన్ని ఎట్టకేలకు గుర్తించారు. కరణ్ను తల్లిదండ్రులు చూసే సమయానికి అతడు చనిపోయాడు.అయితే ఈ కారు ఎవరిది , ఎంతకాలంగా ఈ ప్రాంతంలో పార్క్ చేశారు. ఎందకు పార్క్ చేశారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications