Puneeth Rajkumar: పునీత్ ను చూసి విలపించిన చిరంజీవి, నా జీవితంలో మరిచిపోలేని వ్యక్తి !
బెంగళూరు/ హైదరాబాద్: పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, హీరో శ్రీకాంత్, ఆలీ, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తదితరులు నివాళులు అర్పించారు. పునీత్ రాజ్ కుమార్ పార్థీవ దేహాన్ని చూసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కన్నీనీరు ఆపుకోలేకపోయారు. పక్కనే ఉన్న పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ ను గట్టిగా పట్టుకున్న చిరంజీవి, వెంకటేష్ బోరున విలపించారు. రాజ్ కుమార్ కుటుంబానికి, మెగాస్టార్ కుటుంబానికి సుమారు 40 ఏళ్ల నుంచి చక్కటి అనుబంధం ఉంది. సినిమా నటులుగానే కాకుండా రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు, చిరంజీవి కుటుంబ సభ్యులు ఫ్యామీలో ఫ్రెండ్స్. చిరంజీవి బెంగళూరు ఎప్పుడు వచ్చినా దాదాపుగా శివరాజ్ కుమార్ కచ్చితంగా ఆయన్ను కలుస్తారు. శివరాజ్ కుమార్ మొదటిసారి ఆయన తండ్రి రాజ్ కుమార్ జీవిత చరిత్ర గురించి నానిరువుది నినగాగి అనే టీవీ షో రూపోందించారు. ఆ మొదటి ఎపిసోడ్ కు 2011లో మెగాస్టార్ చీఫ్ గెస్టుగా హాజరై శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ ను ఆశీర్వదించారు.
కన్నీరు పెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి
శ్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం గుండెపోటుతో ప్రాణాలు వదలిలిన విషయం తెలిసింది. కన్నడ, తెలుగు, తమిళ చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించారు. పునీత్ రాజ్ కుమార్ పార్థీవ దేహం చూసిన వెంటనే చిరంజీవి కన్నీరు ఆపుకోలేకపోయారు. కొన్ని నిమిషాల పాటు చిరంజీవి అక్కడే మౌనంగా ఉండిపోయారు.
ఒకేసారి వచ్చిన తెలుగు హీరోలు
పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, హీరో శ్రీకాంత్, ఆలీ, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తదితరులు నివాళులు అర్పించారు. పునీత్ రాజ్ కుమార్ పార్థీవ దేహాన్ని చూసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కననీరు ఆపుకోలేకపోయారు. పక్కనే ఉన్న పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ ను గట్టిగా పట్టుకున్న చిరంజీవి, వెంకటేష్ బోరున విలపించారు.
నా జీవితంలో మరిపోలేని వ్యక్తి పునీత్ రాజ్ కుమార్, చిరంజీవి
పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించిన తరువాత మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు. గత 40 ఏళ్ల నుంచి రాజ్ కుమార్ కుటుంబానికి తో తనకు చక్కటి అనుబంధం ఉందని చిరంజీవి అన్నారు. సినిమా నటులుగానే కాకుండా రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు, మేము ఫ్యామీలో ఫ్రెండ్స్ అని, నేను బెంగళూరు ఎప్పుడు వచ్చినా దాదాపుగా రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను కచ్చితంగా కలుస్తానని చిరంజీవి అన్నారు. వినయం, విధేయత ఉన్న పునీత్ రాజ్ కుమార్ లేని లోటు ఆయన కుటుంబ సభ్యులను దేవుడు తీర్చాలని కోరుకుంటానని, పునీత్ రాజ్ కుమార్ ను నా జీవితంలో నేను మరిచిపోలేనని మెగాస్టార్ చిరంజవి అన్నారు.

రాజ్ టీవీ షోకి ఆ రోజు చిరంజీవి చీఫ్ గెస్ట్
శివరాజ్ కుమార్ మొదటిసారి ఆయన తండ్రి రాజ్ కుమార్ జీవిత చరిత్ర గురించి నానిరువుది నినగాగి అనే టీవీ షో రూపోందించారు. ఆ మొదటి ఎపిసోడ్ కు 2011లో బెంగళూరు శివార్లలోని బిడిదిలో ఉన్న జీ స్టూడియోలో జరిగిన టీవీ షో షూటింగ్ కు మెగాస్టార్ చీఫ్ గెస్టుగా హాజరై శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ ను ఆశీర్వదించారు. ఆ ఎపిసోడ్ లో పూర్తిగా మెగాస్టార్ చిరంజీవి, కర్ణాటకలోని చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో చిరంజీవి, వెంకటేష్, సురేష్ బాబు, శ్రీకాంత్, ఆలీ తదితరులు ఒకేసారి బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలోకి చేరుకోవడంతో అభిమానులు వారిని చూసేదానికి పోటెత్తారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications