ఆరోసారి అకాలీ ‘బాబా’కు చాన్స్ మిస్
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన నాడే రాజకీయాల్లో ప్రవేశించి .. పంజాబ్ పరిణామాల్లో డెబ్బయి ఏళ్లుగా తనదైన శైలిలో చెరగని ముద్ర వేసిన నేపథ్యం శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ది.
చండీగఢ్: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన నాడే రాజకీయాల్లో ప్రవేశించి .. పంజాబ్ పరిణామాల్లో డెబ్బయి ఏళ్లుగా తనదైన శైలిలో చెరగని ముద్ర వేసిన నేపథ్యం శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ది. 89 ఏళ్ల వయస్సులో వరుసగా మూడోసారి.. జీవితంలో ఆరోసారి రాష్ట్ర సీఎంగా పదవీ ప్రమాణం చేసే అవకాశాన్ని ప్రకాశ్ సింగ్ బాదల్ కోల్పోయారు.
2007లో
సీఎంగా
ప్రమాణం
చేసినప్పుడు
నేను
పరుగెత్తగలను.
మీరు
చూస్తారా?
అని
మీడియాతో
చమత్కరించారు.
2012లోనే
దేశంలోకెల్లా
వృద్ధుడైన
ముఖ్యమంత్రిగా
బాదల్
నిలిచారు.
కానీ
వరుసగా
పదేళ్ల
పాటు
సాగిన
బాదల్
ప్రభుత్వం
హయాంలో
డ్రగ్స్
మాఫియా,
ఇతర
అంశాల్లో
బాదల్
కుటుంబం
అవినీతి
తదితర
అంశాల్లో
ప్రజల్లో
వ్యతిరేకత
వెల్లువెత్తడంతో
2017లో
అసాధారణ
రీతిలో
ఆయన
రాజకీయ
జీవితం
ముగిసింది.
తన
సన్నిహితులంతా
'బాబా'గా
ముద్దుగా
పిలుచుకునే
బాదల్
1927
డిసెంబర్
8వ
తేదీన
జన్మించారు.
లాహోర్లోని
క్రిస్టియన్
కళాశాలలో
డిగ్రీ
పట్టా
పుచ్చుకున్న
బాదల్
సారథ్యంలోని
ఎస్ఏడీ
1966లో
పంజాబ్
విభజన
తర్వాత
వరుసగా
మూడోసారి
అధికారంలోకి
రావాలన్న
కల
కలగానే
మిగిలింది.
1947లో
అకాలీదళ్లో
చేరడంతోపాటు
తొలిసారే
20
ఏండ్ల
యువకుడిగా
సొంత
గ్రామ
పంచాయతీ
సర్పంచ్గా..
తర్వాత
బ్లాక్
సమితి
అధ్యక్షుడిగా
ఎన్నికయ్యారు.
1957లో
తొలిసారి
ఎమ్మెల్యేగా
ఎన్నిక
అకాలీదళ్,
కాంగ్రెస్
పార్టీ
మధ్య
పొత్తుతో
1957లో
కాంగ్రెస్
పార్టీ
అభ్యర్థిగా
మాలౌట్
నుంచి
అసెంబ్లీకి
ఎన్నికయ్యారు.1969లో
జరిగిన
మధ్యంతర
ఎన్నికల్లో
గిద్దర్బహా
స్థానం
నుంచి
రెండోసారి
ఎన్నికైన
బాదల్
రాష్ట్ర
మంత్రిగా
పనిచేశారు.
నాటి
సీఎం
గుర్నాంసింగ్
కాంగ్రెస్
పార్టీలోకి
ఫిరాయించారు.
జన్సంఘ్,
ఎస్సెస్పీ
మద్దతుతో
సీఎంగా
బాదల్
కానీ
అకాలీ
ఎమ్మెల్యేలంతా
కలిసి
బాదల్ను
తమ
శాసనసభాపక్ష
నేతగా
ఎన్నుకోవడంతో
జనసంఘ్,
ఎస్సెస్పీల
మద్దతుతో
1970
మార్చి
27న
తొలిసారి
సీఎంగా
పదవీబాధ్యతలు
స్వీకరించారు.
కానీ
అనునిత్యం
సమస్యలతో
15
నెలల
తర్వాత
1971
జూన్
13న
అసెంబ్లీ
రద్దుకు
సిఫారసు
చేశారు.
1972లో
జరిగిన
ఎన్నికల్లో
గెలుపొందిన
బాదల్
విపక్ష
నేతగా
పనిచేశారు.
తిరిగి
197780
మధ్య
32
నెలల
పాటు
సీఎంగా
పని
చేశారు.
ఇలా పార్టీ ఏర్పాటు
1980, 1985లలో ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రకాశ్ సింగ్ బాదల్.. 1985లో సూర్జిత్ సింగ్ బర్నాలా క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా పనిచేసేందుకు నిరాకరించారు. 1985 ఎన్నికల తర్వాత పార్టీలో విభేదాలతో బయటకు వచ్చిన బాదల్.. ఎస్జిపిసిలోని గుర్నాంసింగ్ వంటి తన మద్దతుదారులు తో కలిసి శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఏర్పాటు చేశారు. 20 ఏండ్ల విరామం తర్వాత బీజేపీ మద్దతుతో 1997లో మూడోసారి సీఎంగా ప్రమాణం చేశారు.
ఎస్ఎడి అధ్యక్షుడిగా కొడుకు సుఖ్ బీర్
ఆయన కొడుకు సుఖ్ బీర్ సింగ్ బాదల్ కూడా జలాలాబాద్ నుంచి ప్రస్తుతం అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సుఖ్ బీర్ బార్య హర్ సిమ్రత్ కౌర్ కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. పలువురు బాదల్ కుటుంబ సభ్యులు అసెంబ్లీకి ఎన్నికైన వారిలో ఉన్నారు. ఒకవేళ తమ కూటమి గెలుపొందినా తమ తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్ సీఎంగా ఉంటారని సుఖ్ బీర్ సింగ్ బాదల్ అన్నారు.
మూడో సారి నెరవేరని కల
కానీ ఒక ప్రతాప్ సింగ్ ఖైరోన్, గోపీచంద్ భార్గవ మాదిరిగా మూడోసారి వరుసగా సీఎం కావాలన్న ప్రకాశ్ సింగ్ బాదల్ కలలు మాత్రం సాకారం కాలేదు. గోల్డెన్ టెంపుల్ లో తిష్ట వేసిన మిలిటెంట్లను తరిమి కొట్టేందుకు ఆర్మీ రంగ ప్రవేశం చేసిన 'ఆపరేషన్ బ్లూస్టార్'తోపాటు ధర్మ యుద్ధ మోర్చా వంటి ఆందోళనల సమయంలో అరెస్ట్ అయ్యారు.
సిఎంగా ఉచిత విద్యుత్తు హామీ
మూడోసారి రాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వహించినప్పుడు ప్రకాశ్ సింగ్ బాదల్ రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాతోపాటు రైతుల నుంచి నీటి సరఫరాపై పన్ను వసూళ్లు నిలిపివేశారు. ఆయన హయాంలోనే థెయిన్ డ్యామ్ నిర్మాణం పూర్తి కావడం గమనార్హం. లాంబ్రీ స్థానం నుంచి 2002లోనూ ఎన్నికైన ప్రకాశ్ సింగ్ బాదల్ సారథ్యంలోని అకాలీదళ్ - బీజేపీ కూటమి అధికారంలోకి రాలేకపోయింది. 2012, 2017 ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.