కాంగ్రెస్ నాశనానికి రాహుల్, ప్రియాంక చాలు: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సెటైర్లు

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై తీవ్రస్తాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలు చాలని.. ఇతరులెవరూ అవసరం లేదని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సోమవారం లక్నోలో సీఎం యోగి ఏఎన్ఐ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ప్రతిపక్ష కాంగ్రెస్, ఎస్పీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు యోగి ఆదిత్యనాథ్. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు "బేకార్" కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని కోరినట్లు తెలిపిన సీఎం యోగి.. అలా చేస్తే వారి ఓట్లు వృధా అవుతాయని ఎద్దేవా చేశారు.

 Rahul Gandhi and Priyanka Gandhi Vadra are enough to ruin the Congress: Yogi Adityanath

మతోన్మాదులపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం మాట్లాడుతూ.. తమ గజ్వా-ఇ-హింద్ కల 'ఖయామత్' వరకు నెరవేరదని, ప్రభుత్వం షరియత్ చట్టం ప్రకారం కాకుండా రాజ్యాంగం ప్రకారం పనిచేస్తుందని స్పష్టం చేశారు.
"ఇది కొత్త భారతదేశం, ఇది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశం అని నేను చాలా స్పష్టంగా చెప్పగలను, ఈ కొత్త భారతదేశంలో అభివృద్ధి అందరికీ ఉంటుంది. ఎవరినీ శాంతింపజేయడం ఉండదు' అని స్పష్టం చేశారు.

సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ నినాదంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇది సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ సూత్రంతో పనిచేస్తుంది. కొత్త భారతదేశం షరియత్ ప్రకారం కాకుండా రాజ్యాంగం ప్రకారమే పని చేస్తుందని, గజ్వా-ఏ-హింద్ కల ఖయామత్ వరకు కూడా నెరవేరదని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను' అని యోగి అన్నారు. 'గజ్వా-ఏ-హింద్‌ కావాలని కలలు కనేవాళ్లు, తాలిబానీ మత ఛాందసవాదులు దీన్ని అర్థం చేసుకోండి... భారతదేశం షరియత్ ప్రకారం కాకుండా రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది...!' అని సీఎం యోగి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ శరవేగంగా అభివృద్ధి పధంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ అనే నినాదంతో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఇందులో ఎక్కడా వివక్షకు తావులేకుండా ప్రజలకు రాజ్యాంగబద్ధ ఫలాలను అందిస్తూ, దేశాన్ని ముందుకు నడిపించడమే బీజేపీ ప్రభుత్వం కర్తవ్యమని సీఎం యోగి ఆదిత్యనాథ్ వివరించారు. హిజాబ్ వివాదాలు, ఇతర రాజకీయ ఎత్తుగడలతో కొందరు కూడగట్టుకుని.. దేశాభివృద్ధికి స్పీడ్ బ్రేకుల్లా తయారయ్యారని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు.

బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురాకపోతే ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్, కేరళలా మారుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. సోమవారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు.

'ఈ వ్యక్తులు బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ అరాచకాలను వ్యాప్తి చేస్తున్నారు, దీని కోసం, దీనికి వ్యతిరేకంగా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది, 'అలర్ట్‌గా ఉండండి - ప్రజలకు లభిస్తున్న భద్రత, గౌరవం, దానిని అడ్డుకోవడానికి కొందరు వచ్చారు, అలా జరగనివ్వవద్దు. 'ప్రజలను అప్రమత్తం చేయడం నా బాధ్యత' అని ఆదిత్యనాథ్ అన్నారు.

గత ఏడాది రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింసాత్మక సంఘటనలను హైలైట్ చేస్తూ.. ఆదిత్యనాథ్ మాట్లాడారు. "నేను అడగాలనుకుంటున్నాను, బెంగాల్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయా? ఇటీవల, బెంగాల్‌లో విధానసభ ఎన్నికలు జరిగాయి. బీజేపీ కార్యకర్తలను హింసించారు. బూత్‌లను స్వాధీనం చేసుకున్నారు. అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అనేక మంది వ్యక్తులు మరణించారు. కేరళలోనూ ఇదే పరిస్థితి. ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన హింస, రాజకీయ హత్యలు ఇంకా ఎక్కడ జరిగాయి?' అని యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+