రాహుల్,ఓవైసీ దేశంలో అంతర్యుద్దం కోరుకుంటున్నారు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ దేశంలో అంతర్యుద్దం రావాలని కోరుకుంటున్నారన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలో చీలిక రావాలని వారు కోరుకుంటున్నారని ఆరోపించారు. మొఘల్స్,బ్రిటీషర్స్ కూడా చేయలేనిది రాహుల్,ఓవైసీ,తుక్డే-తుక్డే గ్యాంగ్ చేయాలనుకుంటున్నారని విమర్శించారు.
దేశంలో విభజన రావాలనే వారు ఎదురుచూస్తున్నారంటూ ఆరోపించారు.డిటెన్షన్ కేంద్రాలపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కూడా బీజేపీ తిప్పికొట్టింది. దేశంలో అసలు డిటెన్షన్ కేంద్రాలే లేవంటూ మోదీ అబద్దాలు మాట్లాడారని రాహుల్ ఆరోపించారు. అసోంలో ఏర్పాటు చేసిన డిటెన్షన్ కేంద్రానికి సంబంధించి ఓ వీడియోను ఆయన ట్విట్టర్లో చేశారు.

అయితే అసోంలో ఏర్పాటైన మూడు డిటెన్షన్ కేంద్రాలు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసినవేనంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంభిత్ పాత్ర కౌంటర్ ఇచ్చారు. అబద్దాలు మాట్లాడుతున్నది మోదీ కాదని రాహుల్ గాంధీ అని మండిపడ్డారు.
Union Minister Giriraj Singh in Delhi: What Mughals and Britishers could not do, that Rahul Gandhi, Congress, tukde-tukde gang and Owaisi want to do. They want to divide India. They want a civil war in India. pic.twitter.com/QF79LP5bLU
— ANI (@ANI) December 26, 2019
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications