పార్టీ కార్యకర్తలు సహాయం చెయ్యండి, అందరిని ఆదుకోండి, అమిత్ షా, రాహుల్ గాంధీ, ఖార్గే మనవి !
మిగ్ జాం తుపాను వరదల్లో మరణించిన మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మిగ్ జాం తుపాను ప్రభావిత రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం తుపాను చెన్నై సిటీతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.
మిగ్ జాం తుపాను చెన్నై సమీపంలో 30 గంటల పాటు కొనసాగడంతో చెన్నై సిటీతో సహా తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మిగ్ జాం తపాను 48 గంటల్లో 40 సెంటీమీటర్ల వర్షాన్ని కురిపించింది. దీంతో తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలు భారీ వానల దెబ్బకు ఆ పరిసర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

చెన్నై నగరం, చెన్నై సిటీ శివారు ప్రాంతాలు భారీగా జలమయమయ్యాయి. మంగళవారం ఉదయం నుంచి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. మిగ్ జాం తుపాను కారణంగా తమిళనాడులో చాలా మంది చనిపోయారు. మిగ్ జాం తుపాను ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ పనులు, రిలీఫ్ పనుల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, నెల్లూరు, రాయలసీమకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే మిగ్ జాం తుపాను సహాయక చర్యల్లో పాల్లొనాలని రాహుల్ గాంధీ సూచించారని తెలిసింది.

కేంద్ర హోమ్ శాఖా అమిత్ షా సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను ఫోన్ లో సంప్రదించి చెన్నై సిటీలోని వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని అమిత్ షా మనవి చేశారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో కాంగ్రెస్ పాలుపంచుకోవాలని సూచించారు. చెన్నై సిటీలో పలు స్వచ్చంద సంస్థలు కార్పోరేషన్ అధికారులు, సిబ్బందికి సహాయం చేస్తూ వరద ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications