ప్రధానికి చాలెంజ్ చేసి ఆ ఏరియాలో అడుగు పెడుతున్న యువరాజు, తరువాత !
బెంగళూరు/న్యూఢిల్లీ: మణిపూర్లో గత యాభై రోజులుగా కులం రిజర్వేషన్ల కోసం జరుగుతున్న అల్లర్లు ఆగడం లేదు. అల్లర్లను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. హింసాత్మక ఘటనల్లో ఇప్పటికే వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జూన్ 29వ తేదీ, 30 తేదీల్లో మణిపూర్ రాహుల్ గాంధీ పర్యటించనున్నారు.
మణిపూర్ పర్యటన సందర్భంగా యువరాజు రాహుల్ గాంధీ సహాయ శిబిరాలను సందర్శించనున్నారు. ఇంఫాల్, చురచంద్పూర్లోని వివిధ సంఘాల ప్రతినిధులతో రాహుల్ గాంధీ సంభాషించనున్నారు. వివాద పీడిత మణిపూర్లో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వానికి భద్రత తలనొప్పిగా మారనున్న సంగతి తెలిసిందే.

రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ దాదాపు రెండు నెలలుగా మణిపూర్ మండుతోందని, సంఘర్షణ నుండి శాంతి వైపు సమాజం పయనించాలని, దానికి ఓదార్పు స్పర్శ కావాలని, తద్వారా గొడవలు తగ్గుముఖం పట్టాలని, ఇది మానవతా విపత్తు. ద్వేషం కాకుండా ప్రేమను శక్తిగా మార్చుకోవడం మన బాధ్యత అని అంటున్నారు.
మే 3వ తేదీన ఈశాన్య రాష్ట్రంలో చెలరేగిన హింసలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. షెడ్యూల్డ్ తెగ హోదా కోసం మీటై కమ్యూనిటీ డిమాండ్ను నిరసిస్తూ కొండ జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర సందర్భంగా ఘర్షణలు చెలరేగాయి. రిజర్వేషన్ల విషయంలోనే మణిపూర్ లో ఎవ్వరూ ఊహించని విధంగా గొడవలు ఎక్కువ అయ్యాయి.

జనాభాలో మెయిటై కమ్యూనిటీ 53 శాతం మంది ఉన్నారు. ఈ సంఘం ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తుంది. మరోవైపు, నాగాలు, కుకీలు వంటి గిరిజనులు జనాభాలో 40 శాతం ఉన్నారు. వారు కొండ ప్రాంతాలలో నివసిస్తున్నారు. అందరూ రిజర్వేషన్ల కోసం పోరాటం చెయ్యడానికి ముందుకు దూకండంతో మణిపూర్ అల్లకల్లోలం అయ్యింది.
ఇదే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్ గురించి ఏమాత్రం పట్టించుకోలేదని యువరాజు రాహుల్ గాంధీ మణిపూర్ లోని వివాదాస్పద ప్రాంతాల్లో సంచరించడానికి సిద్దం అయ్యారు. మణిపూర్ హింసాత్మక సంఘటనల విషయంలో యువరాజు రాహుల్ గాంధీ మాత్రమే కాకుండా బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలు సైతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద, ప్రధాని నరేంద్ర మీద తీవ్రవస్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications