రైతు సమస్యలను రాహుల్ మరచిపోయారు.. పినరయి విజయన్ విమర్శలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈట కొట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. రైతులు/ వారి సమస్యలు అంటే రాహుల్ గాంధీకి పట్టవని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. అందుకే స్వేచ్చగా స్విమ్మింగ్ చేశారని దుయ్యబట్టారు. అన్నదాతలను రాహుల్ మర్చిపోయారని విజయన్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తుంటే రాహుల్ ఏమాత్రం పట్టింపు లేకుండా మత్స్యకారులతో కలిసి సముద్రంలో ఈత కొడుతున్నారని ఎద్దవా చేశారు.
విజయన్ గురువారం తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై.. రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ కేరళకు పర్యాటకం కోసం వచ్చినట్టు ఉన్నారని విజయన్ ఫైరయ్యారు. మత్స్యకారులతో కలిసి ఆయన ట్రాక్టర్ తోలుతున్నారని గుర్తుచేశారు. సముద్రంలో ఈత కొడుతున్నారని చెప్పారు. ఢిల్లీలో ఏం జరుగుతుందో అనే విషయమే మర్చిపోయారని విరుచుకుపడ్డారు.

రైతుల గురించి ఒక్క మాటైనా రాహుల్ గాంధీ మాట్లాడటం లేదన్నారు. వారిని పూర్తిగా విస్మరించారని ఫైరయ్యారు. కేరళ రైతులకు మద్దతుగా ఉండాల్సింది పోయి ఇలా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని రాహుల్పై ఒంటికాలిపై లేచారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications