ఆ రాష్ట్రంలో బీజేపీ కూటమి మ్యాచ్ ఫిక్సింగ్, రిగ్గింగ్: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్, రిగ్గింగ్ చేసి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలిచిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 288 సీట్లకు గాను కూటమికి 235 సీట్లు వచ్చాయని మ్యాచ్ ఫిక్సింగ్, రిగ్గింగ్ కారణంగానే ఎన్డీఏ కూటమికి ఇన్ని సీట్లు వచ్చాయని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ కూటమిపై సంచలన ఆరోపణలు చేశారు. 2024లో మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి మ్యాచ్ ఫిక్సింగ్ చేసి గెలుపొందిందని అన్నారు. రిగ్గింగ్ కు మహారాష్ట్ర ఎలక్షన్స్ సాక్ష్యం అని విమర్శించారు. త్వరలో బిహార్ లో జరగనున్న ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే ప్లాన్ అమలు చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతేడాది మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఏర్పడింది. కూటమిలో భాగంగా బేజేపీ, ఏక్ నాథ్ షిండే సారథ్యంలోని శివసేన, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ విజయం సాధించాయి. కూటమికి 235 సీట్లు రాగా.. అందులో 132 సీట్లు కేవలం బీజేపీ మాత్రమే సాధించింది. ఈ క్రమంలో మ్యాచ్ ఫిక్సింగ్, రిగ్గింగ్ కారణంగానే మహారాష్ట్రలో కూటమి గెలిచిందని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.

ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ఐదు సూత్రాలను పాటించిందని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మొదటిది తమకు అనుకూలమైన ఎలక్షన్ కమిషన్ ను ఏర్పాటు చేయడం కోసం ప్యానెల్ ను రిగ్గింగ్ చేయడం.. రెండోది నకిలీ ఓటర్లను లిస్టులోకి దూర్చడం మూడోది వోటింగ్ టర్న్ అవుట్ లో మార్పులు నాలుగోది బోగస్ వోటింగ్ ఐదోది సాక్ష్యాలను దాచడం.. ఈ ఐదు స్టెప్స్ తో బీజేపీ కూటమి ఎన్నికల్లో విజయం సాధిస్తోందని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.
How to steal an election?
— Rahul Gandhi (@RahulGandhi) June 7, 2025
Maharashtra assembly elections in 2024 were a blueprint for rigging democracy.
My article shows how this happened, step by step:
Step 1: Rig the panel for appointing the Election Commission
Step 2: Add fake voters to the roll
Step 3: Inflate voter… pic.twitter.com/ntCwtPVXTu
ఈ ఏడాది నవంబర్ లో బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 243 సీట్లకు ఎన్నికలు నిర్వహించనుంది ఎలక్షన్ కమిషన్. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ మరి కొద్ది రోజుల్లో వెల్లడి కానుంది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications