రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్: కేంద్రం నిర్ణయంతో 11లక్షలమందికి లబ్ది
న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. దసరాకు రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ అందించే కీలక నిర్ణయానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.
కేంద్రం తాజా నిర్ణయంతో 11 లక్షలమందికిపైగా రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం వెల్లడించారు.

'సుమారు 11లక్షల మందికిపైగా రైల్వే ఉద్యోగులకు బోనస్ అందనుంది. గత ఆరేళ్ల నుంచి రైల్వే ఉద్యోగులకు పెద్ద మొత్తంలో నిలకడగా ఏటా బోనస్ ఇస్తూ వస్తున్నాం. ఈ ఏడాది కూడా 11.52లక్షల మంది ఉద్యోగులకు 78రోజుల బోనస్ ఇస్తున్నాం' అని జవదేకర్ తెలిపారు.
రైల్వేలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇదొక రివార్డు లాంటిందని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. రైల్వే ఉద్యోగులకు సరైన మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉందని చెప్పారు. కాగా, రైల్వే ఉద్యోగులకు బోనస్ కారణంగా ప్రభుత్వంపై రూ. 2,024కోట్ల భారం పడనుంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications