ఛార్జీల పెంపు యోచనలో రైల్వే శాఖ
ఛార్జీలను పెంచేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. దీంతో రైల్వే ప్రయాణం మరింత ప్రియం కానుంది.
న్యూఢిల్లీ: ఛార్జీలను పెంచేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. దీంతో రైల్వే ప్రయాణం మరింత ప్రియం కానుంది. భద్రతపరమైన అంశాలకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఆర్థిక శాఖ విముఖత చూడంతో.. ప్రయాణికులపై ప్రత్యేకంగా పన్ను వడ్డించేందుకు రైల్వే సిద్ధమవుతున్నట్లు సమాచారం.
రూ.1.19లక్షల కోట్ల నిధులను భద్రతాపరమైన చర్యల కోసం కేటాయించాలని ఆర్థికశాఖకు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఇటీవల లేఖ రాశారు. అయితే ఆర్థికశాఖ అందులో 25శాతం మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించింది.
మిగతా మొత్తం(75శాతం) సొంతంగా సమకూర్చుకోవాలని రైల్వేను కోరింది. ఈ నేపథ్యంలో టిక్కెట్లపై ప్రత్యేకంగా భద్రత పన్ను వేసి నిధులు రాబట్టుకోవాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంటే త్వరలోనే రైలు ప్రయాణికులపై ఆ మేరకు భారపడనుంది. కాగా, రైలు ప్రమాదాలను అరికట్టేందుకు ఈ మొత్తాన్ని రైల్వే శాఖ వినియోగించనుంది.