50 రైల్వే స్టేషన్లలో జనరిక్ మందుల షాపులు-తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే...
రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు పలు కొత్త కొత్త సదుపాయాలు కల్పిస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ రైల్వే.. ఇప్పుడు మరో ప్రయోగం చేస్తోంది. ఇప్పటికే తాగునీరు, ఆహారాన్ని చౌక ధరలకే అందిస్తున్న రైల్వేలు ఇకపై జనరిల్ మందుల్ని కూడా రైల్వే స్టేషన్లలో అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ఎంపిక చేసిన స్టేషన్లలో ముందుగా ఈ స్టోర్లు ప్రారంభిస్తున్నారు.
ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాల పేరుతో రైల్వే స్టేషన్లలో జనరిక్ మందుల షాపుల్ని ప్రారంభించేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 50 స్టేషన్లను ఎంపిక చేసింది.ఇందులో తక్కువ ధరకే జనరిక్ మందుల్ని ప్రయాణికులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా తెలుగురాష్ట్రాల్లోనూ రెండు రైల్వే స్టేషన్లలో ఈ షాపులు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయి.

ఏపీలోని తిరుపతి రైల్వే స్టేషన్ తో పాటు తెలంగాణలోని సికింద్రాద్ రైల్వే స్టేషన్లలో ఈ జన్ ఔషధి మెడికల్ షాపులు ఏర్పాటు కాబోతున్నాయి. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తున్న రద్దీ స్టేషన్లను ముందుగా వీటి కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి, సికింద్రాబాద్ స్టేషన్లు పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపికయ్యాయి. రాబోయే రోజుల్లో దశల వారీగా మిగతా స్టేషన్లలోనూ ఈ జనరిక్ మందుల షాపులు ప్రారంభిస్తారు.
ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో జనరిక్ మందుల షాపుల ఏర్పాటు కోసం లైసెన్స్ కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ఆ తర్వాత ఐఆర్ఈపీఎస్ ద్వారా ఈ వేలం నిర్వహించి అందులో ఎంపికైన వారికి ఈ షాపులు పెట్టుకునేందుకు అనుమతులు ఇస్తారు. ఇలా మెడికల్ షాపులు పెట్టుకునే వారు కేంద్రం ఎంపిక చేసిన నోడల్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకుని ఈ షాపుల్ని నిర్వహించాల్సి ఉంటుంది. వీటి డిజైన్లను అహ్మదాబాద్ కు చెందిన ఎన్ఐడీ సంస్ధకు అప్పగించారు.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications