వశీకరణం చేసి..పెళ్లయిన 11వ రోజు.. అమావాస్య అర్ధరాత్రి నరబలి..? మృతుడి తల్లి సంచలన వ్యాఖ్యలు
మేఘాలయ కపుల్స్ హనీమూన్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో నిందితులైన సోనమ్ సహా మరో నలుగురు నిందితులను సిట్ పోలీసులు షిల్లాంగ్ లోని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఐదుగురికి 8 రోజుల పోలీసు కస్టడీ విధించింది షిల్లాంగ్ కోర్టు. మరోవైపు తమ కుమారుడు రాజా రఘువంశీ మరణంపై అతడి తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడ్ని అంతా కావాలనే చంపారని ఆరోపించారు.
మేఘాలయ హనీమూన్ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా రాజా రఘువంశీ తల్లి తమ కుమారుడి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనమ్ రఘువంశీ.. తమ కుమారుడ్ని నరబలి ఇచ్చిందని విమర్శలు చేసింది. సోనమ్ కు జాతక దోషం ఉందని.. అందుకే తమ కుమారుడు రాజా రఘువంశీని నరబలి ఇచ్చిందని పేర్కొంది. తన కుమారుడిని చేతబడి చేసి కిరాతకంగా బలి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేసింది.

"సోనమ్ రఘువంశీకి జాతక దోషం ఉంది. అందువల్ల నా కుమారుడిని బలి ఇవ్వాలని ప్లాన్ వేశారు. జాతక దోషం పోతే తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహాను పెళ్లి చేసుకోవాలని సోనమ్ అనుకుంది. అందుకే నా కొడుకుని నరబలి ఇచ్చారు. నా కుమారుడి మృతిపై మాకు న్యాయం జరగాలి. ఈ దారుణానికి పాల్పడ్డవారిని వదిలిపెట్టొద్దు. నా కొడుకు ఏం తప్పు చేశాడు. అతడ్ని ఎందుకు చంపాల్సి వచ్చింది" అని రాజా రఘువంశీ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
Raja Raghuvanshi's mother has made explosive claims against her daughter-in-law and the prime accused, Sonam Raghuvanshi.
— Vani Mehrotra (@vani_mehrotra) June 11, 2025
She has alleged that Sonam may have resorted to black magic, more occult practices, including human sacrifice, to kill her son.
Chilling Details… pic.twitter.com/r9PN9Vspp7
సోనమ్ తన కుమారుడిని వశీకరణం చేసి లొంగదీసుకుందని.. చేతబడి చేసిందని ఆరోపించింది. ఇలాంటి ఘటనలు విన్నాం కానీ ఇప్పుడే కళ్లారా చూస్తున్నామని పేర్కొంది. పెళ్లి తర్వాత దంపతులిద్దరూ అసోంలోని కామాఖ్య ఆలయానికి వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి సోనమ్.. రాజాను నెక్ లేస్ వేసుకోమని బలవంతం చేసేదని తెలిపింది. తన కుమారుడిని నరబలి ఇస్తే అన్ని దోషాలు పోతాయని సోనమ్ భావించిందని రాజా రఘువంశీ తల్లి పేర్కొంది.
Black Magic, Human Sacrifice, Vashikaran, a tantrik necklace, Murder on 11th day of lunar fortnight -- the #rajaraghuvanshi murder gets more intriguing and bizarre #SonamRaghuvanshi https://t.co/9zmrtgp7tI
— Aman Sharma (@AmanKayamHai_) June 11, 2025
ఇక సోనమ్ రఘువంశీ, రాజా రఘువంశీల పెళ్లి మే 11న జరిగింది. మే 20న ఈ జంట మేఘాలయకు వచ్చింది. యితే చివరిసారిగా వీళ్లు మే 23న కనిపించారు. ఆ తర్వాత ఏమైపోయారో తెలియదు. దాదాపు వారం రోజుల పాటు వారి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే జూన్ 3న రాజా రఘువంశీ మృతదేహాన్ని చిరపుంజీ వద్ద ఓ లోయలో పోలీసులు గుర్తించారు.అయితే రాజా మృతదేహం లభ్యం కావడంతో సోనమ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. సోనమ్ తో పాటు మధ్యప్రదేశ్ కు చెందిన మరో ముగ్గురి కిల్లర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
#WATCH | Raja Raghuvanshi murder case | Indore (MP): After Sonam's brother Govind met her, Raja Raghuvanshi's mother, Uma Raghuvanshi, says, "...Govind said that Sonam should be hanged. He is pained for Raja, not Sonam...Govind is not at fault."
— ANI (@ANI) June 11, 2025
She also says, "I asked Govind if… pic.twitter.com/QIktpnX3iH
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications