ఎమ్మెస్సీ చదివిన భర్త వద్దు.. వెయిటర్ ప్రియుడే ముద్దు.. నవవధువు దారుణం!
రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ జిల్లాలో మానవ సంబంధాలకు మచ్చ తెచ్చే ఓ దారుణ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మూడు ముళ్ల బంధం, ఏడడుగుల సాక్షిగా చేసుకున్న బాసలు.. మూడు నెలలు కూడా గడవకముందే రక్తపు మడుగులో ముగిశాయి. బాగా చదువుకున్న భర్త, గౌరవప్రదమైన కుటుంబం, 50 ఏళ్ల బంధుత్వం.. ఇవేవీ ఆ నవవధువును ఆపలేకపోయాయి. కేవలం ఓ వెయిటర్ కోసం, తన పాత ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చిందో కసాయి భార్య. ప్రమాదం అంటూ ఆమె ఆడిన హైడ్రామాను ఛేదించిన పోలీసులు, అసలు నిజాన్ని వెలుగులోకి తెచ్చారు. మానవ సంబంధాలకే మచ్చ తెచ్చే ఈ 'హనీమూన్ మర్డర్' వెనుక ఉన్న దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు మీకోసం..
అసలేం జరిగిందంటే?
సాదుల్షహర్కు చెందిన 23 ఏళ్ల అంజలికి, శ్రీ గంగానగర్కు చెందిన ఆశిష్ (27)తో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. ఆశిష్ భూగర్భ శాస్త్రంలో ఎమ్మెస్సీ (M.Sc Geology) పూర్తి చేసి, బీఈడీ చదువుతున్నాడు. వీరిద్దరి కుటుంబాల మధ్య 50 ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆశిష్ అంజలికి వరుస అవుతాడు. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. జనవరి 30 సాయంత్రం ఆశిష్ తన భార్య అంజలి, మరికొంత మంది బంధువులతో కలిసి వాకింగ్కు వెళ్లాడు. అందరూ తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో అంజలి మొండికేసి ఆశిష్ను ఓ నిర్మానుష్యమైన దారిలోకి తీసుకెళ్లింది. అక్కడ పొదల్లో మాటువేసిన అంజలి ప్రియుడు సంజు, అతని ఇద్దరు స్నేహితులు ఆశిష్పై దాడి చేశారు. సంజు తన స్నేహితులతో కలిసి ఆశిష్ను గొంతు నులిమి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత అది హిట్ అండ్ రన్ (రోడ్డు ప్రమాదం) లాగా కనిపించేలా నాటకమాడారు. తన బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారని, తాను అపస్మారక స్థితిలోకి వెళ్లానని అంజలి నమ్మబలికింది.

పోలీసుల విచారణలో తేలిన నిజం
ఆశిష్ మృతదేహంపై ఉన్న గాయాలు రోడ్డు ప్రమాదంలో జరిగిన వాటిలా లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అంజలిని విచారించగా ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది. కాల్ డేటా, లోతైన దర్యాప్తులో అంజలికి పాత ప్రియుడు సంజుతో సంబంధం ఉన్నట్లు తేలింది. సంజు పెళ్లిళ్లలో వెయిటర్గా పని చేస్తాడు. బాగా చదువుకున్న ఆశిష్ కంటే చదువు లేని వెయిటర్ సంజు వైపే అంజలి మొగ్గు చూపింది.
కన్నకూతురికే ఉరిశిక్ష వేయాలంటున్న కుటుంబం
ఈ ఘటనతో అటు అత్తగారి ఇల్లు, ఇటు పుట్టిల్లు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. అంజలి బాబాయ్ మాట్లాడుతూ.. "మేము సిగ్గుతో తలదించుకుంటున్నాం. మా వంశం గౌరవాన్ని మంటగలిపింది. మా అల్లుడు అనుభవించిన నరకాన్ని చూస్తే, అంజలికి కూడా ఉరిశిక్ష వేయాలని కోరుకుంటున్నాం" అని కన్నీరుమున్నీరయ్యారు. ఆశిష్ తల్లిదండ్రులు కూడా ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications