వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర రోడ్డు ప్రమాదం: 11మంది మృతి

|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్‌లోని సికార్‌ జిల్లాలో జాతీయ రహదారి(11)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11మంది మరణించారు. ఈ ప్రమాదంలో మరో 12మంది గాయాలపాలయ్యారు. జయపుర జిల్లాకు చెందిన వీరంతా బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఫతేపూర్‌కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

Rajasthan road accident kills 11

ఫతేపూర్‌ పోలీస్‌ అధికారి సబ్బీర్‌ ఖాన్‌ తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదానికి గురైన బస్సు మరో వాహనాన్ని అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కు నేరుగా బస్సును ఢీకొట్టిందన్నారు.

క్షతగాత్రులైన12మందిని సికార్‌, జయపుర ఆసుపత్రికి తరలించగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసంకాగా డ్రైవర్‌తో సహా, కండక్టర్‌ మరణించారు. మృతుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. మృతుల కుటుంబాలకు జయపుర జిల్లా పాలనాధికారి రూ.50వేలు పరిహారాన్ని ప్రకటించారు.

English summary
A speeding bus rammed into a tractor-trolley in Sikar in Rajasthan on Wednesday, leaving 12 people dead and 25 critically injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X