CJP 48 గంటల అల్టిమేటమ్: పశువుల పాకలోంచి ఇళ్లల్లోకి మారిన స్కూల్!

రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. శిథిలావస్థకు చేరిన భవనం ప్రమాదకరంగా మారడంతో దాదాపు 18 మంది చిన్నారులు పశువుల పాకలో చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పాటు స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన విద్యాశాఖ అధికారుల అనుమతితో, గ్రామానికి చెందిన ఒక నివాసి తన ఇంటిని పాఠశాల నిర్వహణకు కేటాయించారు. శనివారం ఉదయం నుంచి కొత్త ప్రదేశంలో తరగతులు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.

రాష్ట్రంలో 'స్కూల్ ఠీక్ కరో' పేరిట విపక్షాలు చేపట్టిన పర్యటనల క్రమంలో ఈ పాఠశాల దుస్థితి వెలుగులోకి వచ్చింది. పశువుల కొట్టంలో పిల్లలు చదువుకోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవడమే కాకుండా, 48 గంటల్లో ప్రత్యామ్నాయం చూపకపోతే జైపూర్‌లో భారీ ధర్నా చేపడతామని హెచ్చరికలు జారీ అయ్యాయి. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న గ్రామస్తులు స్వయంగా విద్యాశాఖ అధికారులను కలసి విజ్ఞప్తి చేయడంతో, తాత్కాలికంగా సురక్షితమైన భవనంలోకి తరగతులను మార్చేందుకు అధికారులు సత్వర ఆమోదం తెలిపారు.

Rajasthan School Shifted Out of Cattle Shed Following CJP Leader Abhijeet Dipke s 48-Hour Ultimatum
48 గంటల్లో మొదలుపెడతారా ? నన్ను రమ్మంటారా ?-అభిజీత్ బిగ్ వార్నింగ్..!
48 గంటల్లో మొదలుపెడతారా ? నన్ను రమ్మంటారా ?-అభిజీత్ బిగ్ వార్నింగ్..!

చిన్నారుల భవిష్యత్తే ముఖ్యం: గ్రామస్తుల సాయం

పిల్లల చదువు కోసం తమ వంతు సాయం అందించేందుకు ఊరి ప్రజలు ముందుకొచ్చారు. "స్కూలు మనది, చదువుకునే పిల్లలు మనవాళ్లే" అని పాఠశాలకు ఉచితంగా ఇల్లు కేటాయించిన గ్రామస్తుడు ఆత్మీయంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో పాఠశాలకు పూర్తిస్థాయి పక్కా భవనం నిర్మించేందుకు కూడా గ్రామం తరఫున శ్రమదానం, సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో పిల్లల విద్యను రాజకీయం చేసి ఉద్రిక్తతలు సృష్టించడం సరికాదని, చిన్నారుల భవిష్యత్తు అందరికీ ప్రాధాన్యమని అభిప్రాయపడ్డారు.

CJP: అభిజిత్ దిప్కేపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఎందుకంటే..?
CJP: అభిజిత్ దిప్కేపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఎందుకంటే..?

రాజకీయాలకు తావులేదు: విద్యాశాఖ మంత్రి హెచ్చరిక

పాఠశాలల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యామని కొందరు ప్రచారం చేసుకుంటుండగా, దీనిపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ఘాటుగా స్పందించారు. పాఠశాలలు అనేవి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పవిత్ర దేవాలయాలని, వాటిని రాజకీయ పోరాట వేదికలుగా మార్చవద్దని హితవు పలికారు. ప్రచార ఆర్భాటం కోసం బడులలో వాతావరణాన్ని పాడుచేసే యత్నాలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భద్రత దృష్ట్యా ముందస్తు అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఫోటోలు, వీడియోలు తీయడంపై కూడా విద్యాశాఖ ఆంక్షలు విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+