అభినందించుకున్న మోడీ, బాబు: జగన్ పార్టీలో నిస్తేజం
న్యూఢిల్లీ/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడులు శుక్రవారం పరస్పరం అభినందించుకున్నారు. దేశవ్యాప్తంగా మోడీ హవా కారణంగా బిజెపి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకు పోతోంది. అదే విధంగా సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా ఎన్డీయే 320 సీట్లలో ఆధిక్యంలో ఉంది. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేవలం 71 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.

ఈ నేపథ్యంలో బాబు, మోడీలు ఫోన్ చేసుకున్నారు. పరస్పరం అభినందించుకున్నారు. కాబోయే ప్రధాని, కాబోయే సిఎం అంటూ ఒకరికి ఒకరు అభినందలు తెలిపినట్లుగా తెలుస్తోంది. ఎన్డీయే గెలుపు పట్ల చంద్రబాబు, టిడిపి గెలుపు పట్ల మోడీ హర్షం వ్యక్తం చేశారు.
సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ 14 లోకసభ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 8, భారతీయ జనతా పార్టీ మూడు స్థానాల్లో ముందంజలో ఉంది. తెలంగాణలో తెరాస 12, బిజెపి, కాంగ్రెసు రెండేసి చోట్ల, టిడిపి ఒకచోట ఆధిక్యంలో ఉంది. కాగా, సీమాంధ్రలో ఆశించిన ఫలితాలు కనిపించక పోవడంతో జగన్ పార్టీలో నిస్తేజం కనిపిస్తుండగా, టిడిపి కార్యాలయం వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..??












Click it and Unblock the Notifications