భవిష్యత్తు యుద్ధాలు ఇవే.. సిద్ధంగా భారత్ : రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్
ఆత్మ నిర్భరత అనేది దేశ భద్రతలో భాగమేనని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ భద్రత అనేది కేవలం సైన్యం చేతిలో మాత్రమే లేదని దేశ ప్రజలు కూడా అందుకు తగ్గట్టుగా సిద్ధం కావాలని అన్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని సూచనలు చేశారు. రాబోయే రోజుల్లో ఆయుధాలతో కాకుండా సైబర్ వార్, టెక్నికల్, మానవ రహిత వైమానిక వాహనాలు, శాటిలైట్ ఆధారిత నిఘా విభాగాలు లాంటి వాటిని యుద్ధ ఆయుధాలుగా వినియోగిస్తారని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్ అంబేద్కర్ నగర్ లోని ఆర్మీ వార్ కాలేజీలో త్రివిధ దళాలు నిర్వహించిన సమావేశానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
Mastering existing tech & staying ready for new innovations & unforeseen challenges is key to effectively tackle complexities of modern-day warfare: Union Defence Minister @rajnathsingh at RAN SAMWAD
— PIB India (@PIB_India) August 27, 2025
Self-reliance is no longer just a slogan; it is the unbreakable foundation of… pic.twitter.com/QerEI6ckOo
" అత్యాధునిక యుద్ధాలు కేవలం భూమి, ఆకాశం, నీటిలోనే జరగవు. అవి అంతరిక్షం, సైబర్ స్పేస్ వరకు వ్యాపిస్తాయి. శాటిలైట్ సిస్టమ్స్, యాంటీ- శాటిలైట్ ఆయుధాలు, స్పేస్ కమాండ్ సెంటర్లే ఇప్పుడు అత్యంత శక్తివంతమైనవి. మనం కేవలం రక్షణ పరంగా సిద్ధం కావడం మాత్రమే కాదు. వ్యూహాత్మకంగానూ వ్యవహరించాలి. భవిష్యత్తులో యుద్ధాలు టెక్నాలజీ, ఇంటెలిజెన్స్, ఎకానమీ, డిప్లోమసీ అనుసంధానంగా జరుగుతాయి. ప్రస్తుతం ఎక్కువ మంది సైన్యం, యుద్ధ పరికరాలు అధికంగా ఉండటం ముఖ్యం కాదు. సైబర్ వార్ ఫేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అన్ మానెడ్ ఏరియల్ వెహికల్స్, శాటిలైట్ బేసెడ్ సర్వీలెన్స్ ఇప్పుడు విజయంలో ప్రధానంగా ఉన్నాయి" అని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలోనే భారత్ తన శక్తిని ప్రపంచ దేశాలకు చూపించిందని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అత్యాధునిక యుద్ధ టెక్నాలజీతోనే ఆపరేషన్ సింధూర్ లో విజయం సాధించామని తెలిపారు. ఉగ్రవాదులు మనం చేసే దాడులు పసిగట్టే అవకాశం లేకుండానే వాళ్లపై దాడి చేసి దెబ్బకొట్టామని.. ఈ ఆపరేషనే సాంకేతిక ఆధారిత యుద్ధానికి చక్కటి ఉదాహరణగా తెలిపారు. రోజురోజుకు ప్రపంచ పరిస్థితులు మారిపోతున్నాయని.. వాటికి తగ్గట్లుగా భారత్ బలగాలను సమాయత్తం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శక్తిబాన్ రెజిమెంట్, దివ్యాస్త్ర బ్యాటరీ, రుద్ర, డ్రోన్ ప్లాటూన్ లాంటి వాటిని ఏర్పాటు చేసేందుకు ఆర్మీ చొరవ తీసుకుంటోందని తెలిపారు.

మరోవైపు తాజాగా భారత నౌకా సంపత్తిలో మరో రెండు యుద్ధ నౌకలు చేరాయి. ప్రాజెక్ట్ 17- ఏలో భాగంగా ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలను రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ లాంఛనంగా ప్రవేశపెట్టారు. వీటిని పూర్తి స్థాయిలో దేశీయ సాంకేతికతతో రూపొందించారు. బ్రహ్మోస్ క్షిపణులను మోసుకెళ్లడమే కాకుండా అత్యున్నత స్థాయి ఆయుధాలను గుర్తించే సెన్సార్లు ఉండటం ఈ నౌక ప్రత్యేకతగా అధికారులు వెల్లడించారు. ఈ యుద్ధ నౌకల వివరాలను రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రస్తావించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications