చైనా సరిహద్దుల్లో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్: అనూహ్య పరిస్థితులు
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ, సరిహద్దు పొడవునా తరచూ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణానికి కారణమౌతూ వస్తోంది చైనా. లఢక్ మొదలుకుని అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇదే తరహా వాతావరణం కనిపిస్తుంటుంది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు- భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నిస్తుండటం దీనికంతటికీ కారణం.
#WATCH | 'Incredible India' gate on the Indian side and Chinese Border Personnel Meet facility (blue-roofed huts) on the Chinese side seen from Bum La in Arunachal Pradesh pic.twitter.com/oiYdmzJqpH
— ANI (@ANI) October 24, 2023
గతంలో అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో భారత్-చైనా సరిహద్దుల వద్ద గ్రామాలకు గ్రామాలను సైతం నిర్మించింది చైనా. దీనిపై భారత్ అనేకసార్లు అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ.. పట్టించుకోలేదు. అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్నీ తమదేశ భూభాగంగా చూపించిన మ్యాప్లను సైతం మొన్నీ మధ్యే విడుదల చేసింది కూడా.

ఈ పరిస్థితుల్లో- రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. భారత- చైనా సరిహద్దులకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఉదయం బమ్ లా పాస్కు వెళ్లారాయన. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లా- చైనాలోని సోనా కంట్రీని అనుసంధానించే మార్గం ఇది. భారత్- చైనా సరిహద్దు విషయంలో అత్యంత సున్నిత, సమస్యాత్మక ప్రాంతంగా భావిస్తుంటారు ఈ ప్రాంతాన్ని.
బమ్ లా పాస్కు వెళ్లిన రాజ్నాథ్ సింగ్ సరిహద్దు భద్రత జవాన్లను కలిశారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. తవాంగ్ వార్ మెమొరియల్ను సందర్శించారు. 1962 నాటి సినో- ఇండియన్ యుద్ధంలో అమరుడైన సుబేదార్ జోగిందర్ సింగ్ విగ్రహానికి నివాళి అర్పించారు. దసరా పండగ వేడుకలను బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి జరుపుకొన్నారు. ఆయుధ పూజలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. నాలుగు సంవత్సరాల కిందట బమ్ లా పాస్ను సందర్శించానని గుర్తు చేసుకున్నారు రాజ్నాథ్ సింగ్. విజయదశమిని పండగను మరోసారి జవాన్లతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. దేశ సరిహద్దులను కాపాడే బాధ్యతను మీరు భుజానకెత్తుకున్న జవాన్లే అసలైన హీరోలని ప్రశంసించారు.
#WATCH | Defence Minister Rajnath Singh performs Shashtra Puja at Tawang, Arunachal Pradesh on #VijayaDashami #Dussehra pic.twitter.com/ZXX6nCBEQQ
— ANI (@ANI) October 24, 2023
సంక్లిష్ట వాతావరణం, ఉద్రిక్త పరిస్థితుల్లో సరిహద్దుల్లో పహారా కాసే జవాన్లతో విజయదశమి పండగను జరుపుకోవడం అదృష్టంగా భావిస్తోన్నానని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు వారిని చూసి గర్వపడుతున్నారని అన్నారు. అన్ని రంగాల్లోనూ దేశ ప్రతిష్ఠ రెట్టింపైందని, ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశ సరిహద్దులను సురక్షితంగా ఉంచడం వల్లే ఇది సాధ్యపడిందని కితాబిచ్చారు
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications