భారత్‌పై కన్నేస్తే 'డాట్.. డాట్.. డాట్..': పాకిస్థాన్‌కు మాస్ వార్నింగ్!

పాకిస్థాన్ దుస్సాహసాలకు పాల్పడితే భారత్ చూస్తూ ఊరుకోదని, భారత్‌ను ప్రమాదంలో నెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. బుధవారం జర్మనీలోని బెర్లిన్‌లో భారతీయ సమాజంతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న నయా వైఖరిని స్పష్టం చేశారు. "ఒక్క పొరుగువాడు తప్ప మిగిలిన వారందరూ బాగున్నారు" అంటూ పాకిస్థాన్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

భారతదేశం ఎప్పుడూ ఏ దేశంపై ముందుగా దాడి చేయలేదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే, శాంతిని బలహీనతగా భావించవద్దని హెచ్చరించారు. "భారత సైనిక వ్యవస్థ గతంలో కంటే అత్యంత దృఢంగా మారింది. పొరుగుదేశాలన్నీ సఖ్యతగానే ఉన్నా, సమస్యలు సృష్టించేది మాత్రం ఒక్క దేశమే (పాకిస్థాన్)" అని ఆయన మండిపడ్డారు. ఇటీవల పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ, కోల్‌కతాపై దాడి చేస్తామని బెదిరించిన నేపథ్యంలో రాజ్‌నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Rajnath Singh Warns Pakistan in Berlin Expect Unimagined Response if India s Security is Threatened

సరిగ్గా ఏడాది క్రితం, 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను బలిగొన్న ఉదంతాన్ని రాజ్‌నాథ్ గుర్తు చేసుకున్నారు. "ఆనాడు మన పౌరులు చిందించిన రక్తాన్ని, దేశానికి కలిగిన ఆ గాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము" అని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ దాడికి ప్రతీకారంగా మే 7న భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' గురించి ప్రస్తావిస్తూ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ఎలా మట్టికరిపించిందో పాకిస్థాన్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

ప్రపంచ వివాదాల్లో భారత్ 'సమతుల్య' దౌత్యం..

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అంతర్జాతీయ వేదికపై అత్యంత గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుందని రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, పశ్చిమాసియా సంక్షోభం కావచ్చు.. భారత్ ఎప్పుడూ శాంతి వైపు, దౌత్య చర్చల వైపు నిలబడిందని ఆయన గుర్తు చేశారు. "ప్రధాని మోడీ ఒకవైపు పుతిన్, జెలెన్ స్కీలతో మాట్లాడుతూనే.. మరోవైపు ట్రంప్‌తో కూడా చర్చలు జరిపి శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, ప్రపంచ వివాదాలను పరిష్కరించడంలో భారత్ త్వరలోనే కీలక పాత్ర పోషించబోతోంది" అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ - భారత్ పవర్!

ప్రపంచ దేశాల నౌకలు ప్రయాణించడానికి భయపడే 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' మీదుగా భారతీయ నౌకలు సురక్షితంగా వెళ్లగలుగుతున్నాయంటే అది మన దౌత్య విజయమని రాజ్‌నాథ్ వివరించారు. అమెరికా, ఇరాన్ వంటి దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. భారత్ అనుసరిస్తున్న సమతుల్య విధానం కారణంగానే మన నౌకలకు ఎక్కడా అడ్డంకులు ఎదురుకావడం లేదని ఆయన తెలిపారు.

భారత్-జర్మనీ: 75 ఏళ్ల బంధం..

వచ్చే ఏడాది (2026) భారత్-జర్మనీ దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు నిండుతాయని, ఈ ప్రయాణంలో జర్మనీ మనకు ఐరోపాలోనే అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఎదిగిందని రాజ్‌నాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2,000 కంటే ఎక్కువ జర్మన్ కంపెనీలు 'మేక్ ఇన్ ఇండియా'లో భాగస్వాములై ఉన్నాయని, ఇరు దేశాల బంధం ప్రజాస్వామ్య విలువలపై ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు. రక్షణ శాఖ మంత్రి హోదాలో తన మొదటి జర్మనీ పర్యటన విజయవంతమైందని, రక్షణ మరియు పారిశ్రామిక రంగాల్లో ఈ భాగస్వామ్యం మరింత బలపడుతుందని ఆయన ఆకాంక్షించారు.

మొత్తానికి, పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇస్తూనే.. ప్రపంచ శాంతి స్థాపనలో భారత్ పోషించబోయే అగ్రగామి పాత్రను రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగం ద్వారా స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+