ఉగ్ర ఘాతుకం: బాంబు దాడిలో ఐదుగురు సైనికులు మృతి, ఒకరికి తీవ్రగాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో ఐదుగురు సైనికులు మరణించారు. మరో జవానుకు తీవ్రగాయాలయ్యాయి. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవేట కొనసాగిస్తున్న సమయంలో దొంగచాటుగా ఉగ్రవాదులు దాడి చేశారు.
ఇటీవల జమ్మూకాశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడులకు పాల్పడటంతో ఐదుగురు సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు, విజిబిలిటీ సరిగా లేకపోవడం వంటి పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్న ఉగ్రవాదులు.. సైనికులు వెళుతున్న ట్రక్కుపై గ్రనేడ్లతో విరుచుకుపడ్డారు.

కాగా, ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులు కాండి ఫారెస్ట్లోని ఓ గుహలో ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి ఆర్మీకి సమాచారం అందింది. దీంతో గురువారం నుంచి సైనికులు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఉగ్రవాదుల జాడ గుర్తించడంతో.. ఇరువైపులా కాల్పులు జరిగాయి. అక్కడ్నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు పేలుడు పదార్థాన్ని ఉపయోగించారు.
J&K | Five soldiers lost their lives in the encounter ongoing in Kandi area of Rajouri. Senior officials have reached the spot.
— ANI (@ANI) May 5, 2023
(Visuals deferred by unspecified time) pic.twitter.com/3sIKz28Wus
ఈ బాంబు దాడిలో ఇద్దరు ఆర్మీ అధికారులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఉధంపూర్లోని కమాండ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఉగ్రవాదులు ఆ ప్రాంతంలోనే దాక్కుని ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజౌరి జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఉగ్రవాదుల కోసం సైనికులు వేట కొనసాగిస్తున్నారు.
కాగా, గురువారం బారాముల్లా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక ఎకె 47 రైఫిల్, ఒక పిస్టల్తో సహా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు స్థానికులు, నిషేధిత ఉగ్రవాద సంస్థ LeTకి చెందినవారు. వారిని షోపియాన్ జిల్లాకు చెందిన షకీర్ మాజిద్ నజర్, హనన్ అహ్మద్ సేగా గుర్తించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications