యూపీలో అరుదైన సీన్ : సలాం.. రామ్ రామ్.. అఖిలేశ్, ప్రియాంక పరస్పర అభివాదం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీన్నీ తలమునకలై ఉన్నాయి. అధికారాన్ని మరో సారి కైవసం చేసుకునేందుకు కాషాయ దళం జోరుగా ప్రచారం చేస్తోంది. పార్టీ ఆగ్ర నేతలు సైతం రంగంలోకి దిగారు. కేంద్రం హోం మంత్రి అమిత్ షా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా హామీలు గుప్పిస్తూ ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. అటు కాంగ్రెస్ పార్టీ తమ పట్టుకు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యూపీ ఎన్నికల్లో అన్ని తానై పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.
ప్రచారంలో ప్రియాంక దూకుడు
యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. మొత్తం 403 స్థానాలకు గాను 402 అసెంబ్లీ స్థానాలలో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపారు. రైతును, నిరుద్యోగులను, మహిళలను కలసుకుంటున్నారు. బీజేపీ పాలనపై పదునైన విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. యోగీ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమిలేదని ఆరోపణలు గుప్పించారు. అభివృద్ధిని పక్కన పెట్టి.. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతుందని ఆరోపణలు గుప్పించారు
ఆసక్తికర దృశ్యం.. అఖిలేశ్, ప్రియాంక పరస్పర అభావాదం
అయితే యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అరుదైన సీన్ చోటు చేసుకుంది. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రచారంలో ఎదురెదురు పడ్డారు. పరస్పరం అభివాద చేసుకున్నారు. ఈ ఆసక్తికర దృశ్యం బులంద్శహర్లో చోటు చేసుకుంది. జయంత్ చౌదరితో కలిసి అఖిలేశ్ యాదవ్ ప్రచారం నిర్వహిస్తుండగా.. ప్రియాంక గాంధీ కూడా తన వాహనశ్రేణితో అటువైపు వచ్చారు. దీంతో ముగ్గురు నేతలు పరస్పరం అభివాదం చేసుకున్నారు. అక్కడే ఉన్న సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు ఈలలు వేస్తూ..జెండాలు ఊపుతూ ఆనందోత్సాహాలతో ముందుకు సాగారు. ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన ఫొటోను అఖిలేశ్యాదవ్.. వీడియోను ప్రియాంక గాంధీ తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.
Recommended Video

ఏడు దశల్లో యూపీ ఎన్నికలు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్ దళ్ తో కలిసి సమాజ్ వాదీ పార్టీ పోటీకి దిగాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగింది. ఈ అసెంబ్లీ ఎన్నికలు అధికార బీజేపీకి, అఖిలేశ్ నేతృత్వంలోని కూటమికి మధ్యే ప్రధాన పోటీ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా , ఎన్నికల ప్రచారంలో అఖిలేశ్ యాదవ్, ప్రియాంక గాంధీలే ప్రధాన లక్ష్యంగా చేసుకుని బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications