ఎట్టకేలకు మౌనం వీడిన ఆర్బీఐ గవర్నర్: పెద్ద నోట్ల రద్దుపై ఇలా..
ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన తర్వాత నుంచి ఎలాంటి ప్రకటనా చేయని ఉర్జిత్ పటేల్.. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెద్ద నోట్ల రద్దుపై స్పందించారు.
ముంబై: పెద్ద నోట్ల రద్దు అంశంపై ఎట్టకేలకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మౌనం వీడారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన తర్వాత నుంచి ఎలాంటి ప్రకటనా చేయని ఉర్జిత్ పటేల్.. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెద్ద నోట్ల రద్దుపై స్పందించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను రోజువారీగా పరిశీలిస్తున్నామని తెలిపారు.
బ్యాంకుల్లో నగదు లభ్యత రోజురోజుకు పెరుగుతోందన్నారు. నగదు సమస్యను పరిష్కరించేందుకు బ్యాంకులు నిరంతరాయంగా పనిచేస్తున్నాయనివివరించారు. నిజాయితీపరుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

బ్యాంకులు, ఏటీఎంల్లో నగదు అందుబాటులో ఉందని, డిమాండ్కు అనుగుణంగా నోట్ల ముద్రణ జరుగుతోందని ఉర్జిత్పటేల్ వివరించారు. రూ.500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన తర్వాత ఉర్జిత్ పటేల్ ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాని విషయం తెలిసిందే.
చిల్లర సమస్యతో దేశ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, రూ.2వేల నోటుకు చిల్లర దొరక్క సామాన్యుడు అల్లాడిపోతున్నా.. ఉర్జిత్ పటేల్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. పెద్ద నోట్లు రద్దు తర్వాత ఆయన స్పందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications