ఊదారంగులో, నయా ఫీచర్లు: కొత్త రూ.100నోటు చూశారా?
ముంబై: భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) గురువారం కొత్త వందరూపాయల నోటును విడుదల చేసింది. మహాత్మాగాంధీ కొత్త సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఈ నోటుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది.
ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో గుర్తింపు పొందిన గుజరాత్లోని 'రాణి కీ వావ్'ఫొటో నోటు వెనుక భాగంలో ముద్రించారు. కొత్త వందనోటు ఊదా రంగులో ఉంది. ఈ నోటు 66ఎంఎం X 142ఎంఎం ఉంది. ఈ నోటుపై స్వచ్ఛ భారత్ లోగో, ఏ సంవత్సరంలో ముద్రించారు అనే వివరాలు కూడా ఉంటాయి.

కొత్త వంద నోటు పది రూపాయల నోటు కంటే కొద్దిగా పెద్దగా.. పాత వంద నోటు కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. దీవస్లోని ముద్రణా కార్యాలయంలో కొత్త వంద నోట్ల ముద్రణ ఇప్పటికే ప్రారంభమైంది.
వీలైనంత త్వరలోనే ఈ కొత్త వంద నోట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ తెలిపింది. ఈ నోటులో కొత్తగా కొన్ని మైక్రో సెక్యూరిటీ ఫీచర్లను చేర్చినట్లు వెల్లడించింది. ఈ ఫీచర్లు అతినీలలోహిత కాంతిలో మాత్రమే కనిపిస్తాయి. కాగా, పాత వంద నోట్లు కూడా చెలమణీలో కొనసాగుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications