దేశం కోసం మరో కొడుకును ఆర్మీకి ఇస్తా .. పాకిస్తాన్ పై ప్రతిదాడి చేయాలన్న వీరజవాను తండ్రి
పాట్నా : పుల్వామా ఉగ్రదాడిని యావత్ ప్రపంచం ఖండిస్తోంది. ఈ దాడిని హేయనీయమైన చర్యగా అభివర్ణిస్తున్నాయి. ఉగ్రదాడిలో జవాన్ల వీరమరణంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. వీరుడా .. వందనం అంటూ యావత్ జాతి జవాన్లకు నివాళులర్పిస్తోంది.

దాడిలో నెలకొరిగిన వీరుడు
గురువారం మధ్యాహ్నం జరిగిన ఉగ్ర దాడిలో బీహర్ కు చెందిన జవాను రతన్ కుమార్ వీరమరణం పొందాడు. ఇంటికి పెద్దవాడి మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. రతన్ ఇకలేరనే విషయాన్ని కుటుంబసభ్యులు, బంధువులే కాదు స్థానికులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

మరో కొడుకును ఇస్తా కానీ ...
భారతమాతకు సేవ చేసేందుకు రతన్ కుమార్ ను సైన్యంలో చేర్పించానని ఆయన తండ్రి గద్గత స్వరంతో చెప్పారు. దేశానికి సేవ చేసేందుకు తన మరో కుమారుడిని ఇస్తానని భాగల్ పూర్ లో మీడియాకు చెప్పారు. కానీ పుల్వామా ఉగ్రదాడికి ధీటుగా పాకిస్థాన్ కు జవాబివ్వాలన్నారు. భారతమాతకు సేవలందించేందుకు తన కుమారుడిని త్యాగం చేశానని .. దేశానికి సేవ చేసేందుకు మరో కుమారుడిని కూడా ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. కానీ పాకిస్థాన్ కు మాత్రం సరైన సమాధానం చెప్పాలని స్పష్టంచేశారు.

దాడిలో వీరుల మరణం
గురువారం మధ్యాహ్నం జమ్ము నుంచి సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ శ్రీనగర్ బయల్దేరింది. దాదాపు 78 వాహనాల్లో 2 వేల 547 మంది జవాన్లు వెళ్తుండగా .. పుల్వామా జిల్లాలో గోరిపుర ప్రాంతంలో గల అవంతిపుర వద్ద ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఓ కారులో ఐఈడీ పేలుడు పదార్థంతో కాన్వాయ్ లోని వాహనాన్ని ఢీ కొనడంతో వాహనం తునాతునకాలై .. జవాన్ల ఎగిరిపడ్డారు. ఆ ప్రాంతమంతా మాంసపు ముద్దలతో .. రక్తంతో భీతావహంగా మారింది. ఈ దాడిలో పదుల సంఖ్యలో జవాన్లు చనిపోయారు. గాయపడ్డ వారికి శ్రీనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

యూపీ వీర జవాన్లకు పరిహారం
ఉగ్రదాడిలో మరణించిన వీర జవాన్ల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు అందజేస్తామని తెలిపింది. పుల్వామా ఉగ్రదాడిలో యూపీకీ చెందిన 12 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications