‘దిల్లీలో లాక్డౌన్ విధించడానికి సిద్ధమే కానీ, ఎన్సీఆర్ అంతటా అమలుచేస్తేనే ఫలితం ఉంటుంది’ - Newsreel

దిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.
కాలుష్య నియంత్రణకు దిల్లీలో పూర్తి లాక్డౌన్ విధించడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. కానీ, నేషనల్ కేపిటల్ రీజియన్(ఎన్సీఆర్) పరిధిలోనూ అలాంటి చర్యలే తీసుకోవాలని దిల్లీ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది.
కాలుష్యం నియంత్రించడానికి అత్యవసర ప్రణాళిక కింద దిల్లీలో రెండు రోజులు లాక్డౌన్ విధించడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం రెండు రోజుల కిందట దిల్లీ ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే.
దీనిపై సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం, లాక్డౌన్ వల్ల పరిమిత ప్రభావమే ఉంటుందని చెప్పింది. దిల్లీలాగే నగరం చుట్టు పక్కల నేషనల్ కాపిటల్ రీజియన్లోనూ అలాంటి చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పింది.

"ప్రాంతీయ స్థాయిలో ఉద్గారాలను నియంత్రించడానికి పూర్తి లాక్డౌన్ అమలయ్యేలా చర్యలు తీసుకోడానికి దిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఇలాంటి నిర్ణయం మొత్తం ఎన్సీఆర్ పరిధిలో అమలు చేస్తే, ఫలితం ఉంటుంది. దిల్లీ వరకే లాక్డౌన్ విధించడం వల్ల గాలి నాణ్యతపై పరిమిత ప్రభావం ఉంటుంది" అని తమ అఫిడవిట్లో చెప్పింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ కేసులో విచారణలు చేపట్టింది.
రాజధాని దిల్లీలో కాలుష్యం నియంత్రణ కోసం పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా నడుస్తున్న అన్ని వాహనాలపై తాము చర్యలు తీసుకుంటామని దిల్లీ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.
దీనికోసం 550 మంది ట్రాఫిక్ సిబ్బందిని 170 ప్రాంతాల్లో మోహరించినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీ: కరెన్సీ నోట్లు, అలంకార వస్తువులకే పరిమితం కానున్నారా?
- డెమిసెక్సువాలిటీ అంటే ఏమిటి? ఈ లైంగిక భావనను వివరించడం ఎందుకు క్లిష్టమైన విషయం?
- జుల్ఫికర్ అలీ భుట్టో: 47 ఏళ్ల కిందటి ఒక హత్య కేసు ఈ నేత మెడకు ఉరి తాడులా ఎలా చుట్టుకుంది?
- టీ20 ప్రపంచకప్ ఫైనల్: న్యూజీలాండ్, ఆస్ట్రేలియా జట్లలో ఎవరిది పైచేయి...
- బంగ్లాదేశ్ హిందువుల ఉపవాస దీక్ష, ఇజ్రాయెల్లో పెలికాన్ల సందడి, కొలంబోలో వరద బీభత్సం - ఈ వారం ప్రపంచ చిత్రాలు ఇవీ
- దిల్లీ కాలుష్యంపై సుప్రీం కోర్టు సీరియస్... అవసరమైతే లాక్డౌన్ విధించాలని సూచన
- టీ20 ప్రపంచకప్: వేడ్ క్యాచ్ను హసన్ అలీ వదిలేయడం వల్లే పాకిస్తాన్ సెమీస్లో ఓడిందా?
- ఆంధ్రప్రదేశ్: పీఆర్సీ కోసం ఉద్యోగుల పట్టు... ఎందుకీ జాప్యం? ప్రభుత్వం ఏమంటోంది?
- ఆనందం లేదా భయం కలిగినప్పుడు మనం గట్టిగా ఎందుకు అరుస్తాం?
- హిందుత్వను ఐసిస్, బోకోహరామ్లతో పోల్చిన సల్మాన్ ఖుర్షీద్... కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications