ఎంజీ మోటార్ లో వాటా కోసం పోటీపడుతున్న రిలయన్స్, హీరో
చైనాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ ఎంజీ మోటార్ (MG Motor) భారత్లోని తన అనుబంధ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియాలో మెజారిటీ వాటాను విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం దేశీయంగా కొనుగోలుదారుల కోసం అన్వేషిస్తోంది. ప్రస్తుతం వివిధ సంస్థలతో చర్చలు జరుపుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries), హీరో గ్రూప్ (Hero group), జేఎస్డబ్ల్యూ గ్రూప్ (JSW group), ప్రేమ్జీ ఇన్వెస్ట్ వంటివి రేసులో ఉన్నాయి. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఆఖరుకల్లా డీల్ పూర్తి చేయాలని ఎంజీ మోటార్ భావిస్తోంది.
మెజారిటీ వాటా విక్రయించడం ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించే ప్రణాళికలో ఉన్నట్లు ఎమ్జీ మోటార్ ఇండియా వెల్లడించింది. ప్రధానంగా భారత్ లోని భాగస్వాముల కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించింది. బ్రిటిష్ బ్రాండ్ అయిన ఎమ్జీ మోటార్.. ప్రస్తుతం చైనాకు చెందిన ఎస్ఏఐసీ మోటార్ కార్ప్ చేతిలో ఉంది. 2028 కల్లా మన దేశంలో కార్యకలాపాలను విస్తరించడం కోసం రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని కంపెనీ భావిస్తోంది.

చైనాలోని ఎస్ఏఐసీ నుంచి మూలధనాన్ని సేకరించేందుకు ఎమ్జీ ఇండియా ప్రయత్నిస్తున్నా సఫలమవడంలేదు. సరిహద్దుల్లో చైనాతో ఘర్షణ జరిగిన తర్వాత ఇండియా ఎఫ్డీఐ నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో రెండు సంవత్సరాల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) పొందేందుకు ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. ఇవేవీ సత్ఫలితాలనివ్వకపోవడంతో ప్రత్యామ్నాయం మార్గం కోసం ప్రయత్నిస్తోంది. వాటాల విక్రయం ద్వారా వచ్చే నిధులతో దేశంలో రెండో తయారీ ప్లాంటు నెలకొల్పాలని, వార్షిక సామర్థ్యాన్ని 3,00,000 వాహనాలకు చేర్చాలని భావిస్తోంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications