అమరవీరుడి భార్యకు అశోకచక్ర: కన్నీళ్లు పెట్టిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దేశం కోసం వీర మరణం పొందిన సైనికుల కుటుంబసభ్యులకు శౌర్య అవార్డులు ఇవ్వడం సాధారణమే. ఈ ఏడాది కూడా రాష్ట్రపతి హోదాలో తొలిసారి రామ్నాథ్ కోవింద్ ఈ అవార్డులను అందజేశారు.
Recommended Video
ఈ సందర్భంగా గతేడాది నవంబర్లో వీర మరణం పొందిన ఎయిర్ఫోర్స్ కమాండో జేపీ నిరాలా భార్య, తల్లికి అశోక చక్ర అవార్డు ఇచ్చిన తర్వాత కోవింద్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కంటతడి పెట్టారు. ఆయన కన్నీళ్లను కర్చీఫ్తో తుడుచుకుంటూ కనిపించారు. నిరాలా గత నవంబర్లో బందీపుర ఎన్కౌంటర్ సందర్భంగా వీర మరణం పొందారు.
#AshokaChakra awarded to Late Air Force Commando JP Nirala, who lost his life in Bandipora encounter. President Kovind presents award to JP Nirala's mother and wife. #RepublicDay pic.twitter.com/S6E7pJysdP
— ANI (@ANI) January 26, 2018
కాగా, 69వ గణతంత్ర వేడుకలకు పది దేశాలకు చెందిన నేతలు హాజరయ్యారు. వారందర్నీ ప్రధాని మోడీ ఆహ్వానించారు. దీని కోసం రాజ్పథ్లో ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేశారు. త్రివిధదళాధిపతులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవం: అమరవీరులకు మోడీ నివాళులు, బీఎస్ఎఫ్ మహిళల అద్భుత ప్రదర్శన
ఆసియా దేశాల జెండాలతో ఆర్డీ పరేడ్ నిర్వహించనున్నారు. మొత్తం 23 శకటాలు కూడా పాల్గొంటాయి. థాయిలాండ్ ప్రధాని ప్రయుత్ చాన్ ఓచా, సింగపూర్ ప్రధాని లీ హిసన్ లూంగ్, పిలిప్పీన్స్ ప్రెసిడెంట్ రోడ్రిగో డుటెర్టో, ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడో, మయన్మార్ నేత ఆంగ్ సూకీ, బ్రూనై సుల్తాన్ హసన్లాల్లకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. లావోస్ ప్రధాని థంగ్లున్ సిసౌలత్, వియత్నం ప్రధాని నుయ్ జు ఫున్, కంబోడియా ప్రధాని సామ్డెక్ అక్కా మోహ సేనలు కూడా రాజ్పథ్కు వచ్చారు.