Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

LIVE : దేశవ్యాప్తంగా మువ్వన్నెల రెపరెపలు: అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు

న్యూఢిల్లీ: 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగనున్నాయి. గణతంత్ర వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్ దేశాధినేత జైర్ బోల్సోనారో మనదేశానికి విచ్చేశారు. ఆయనకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ ఘనస్వాగతం పలికారు.

కాగా, మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 దినానికి గౌరవ సూచకంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ రోజున బ్రిటీషు కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

 republic day celebrations 2020 in delhi live updates

భారతదేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం వచ్చింది. దేశానికి రాజ్యాంగము తయారు చేయటానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అధ్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29 న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగము తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విధానంగా రూపుదిద్దారు. అనేక సవరణల అనంతరము 1949 నవంబర్ 26 న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.

భారత రాజ్యాంగానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలము పట్టింది. ప్రపంచములోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగముగా గుర్తించబడింది. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచడంతో భారతదేశము సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా రూపొందడంతో పరిణామ దశ పూర్తయింది. 1930 జనవరి 26న పూర్ణ స్వరాజ్ ప్రకటించడం జరిగింది.

Jan 26, 2020, 4:23 pm IST

భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన మాల్దీవ్స్ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సొలిహ్,శ్రీలంక ప్రధాని మహీంద్రా రాజపక్షసలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. భారత్,మాల్దీవ్స్ మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయని,ఇది ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు.
Jan 26, 2020, 3:53 pm IST

న్యూఢిల్లీ

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నేపాల్‌ ప్రభుత్వానికి 30 అంబులెన్సులు, ఆరు బస్సులను బహుమతిగా అందజేసిన భారత్.
Jan 26, 2020, 3:32 pm IST

తెలంగాణ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం శ్యామా ప్రసాద్ ముఖర్జీ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి
Jan 26, 2020, 3:17 pm IST

పశ్చిమ బెంగాల్

పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో భారతమాత చిత్రపటానికి బీజేపీ కార్యకర్తల ప్రత్యేక పూజలు. అడ్డుకున్న పోలీసులు. బీజేపీ, పోలీసుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ.. ఉద్రిక్తత
Jan 26, 2020, 2:50 pm IST

తెలంగాణ

రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్
Jan 26, 2020, 2:30 pm IST

న్యూఢిల్లీ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
Jan 26, 2020, 2:22 pm IST

తెలంగాణ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సైనిక అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు
Jan 26, 2020, 2:18 pm IST

తెలంగాణ

హైదరాబాద్‌లో వేదమంత్రోచ్ఛారణల మధ్య జాతీయ పతాకాన్ని ఎగురవేసిన శంకర గురుకుల వేద పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు
Jan 26, 2020, 2:10 pm IST

జమ్మూ కాశ్మీర్

జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎగిరిన త్రివర్ణ పతాకం. ఆర్ఎస్ పురా సెక్టార్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన బీఎస్ఎఫ్ అధికారులు
Jan 26, 2020, 2:04 pm IST

కర్ణాటక

బెంగళూరు ఫీల్డ్ మార్షల్ మాణిక్‌షా పరేడ్ మైదానంలో వైభవంగా కొనసాగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా. హాజరైన ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప
Jan 26, 2020, 1:59 pm IST

ఆంధ్రప్రదేశ్

తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
Jan 26, 2020, 1:45 pm IST

న్యూఢిల్లీ

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆకట్టుకున్న జమ్మూ కాశ్మీర్ శకటం.. బ్యాక్ టు విలేజ్.
Jan 26, 2020, 1:44 pm IST

న్యూఢిల్లీ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో స్వీట్లను పంచుకున్న రెండు దేశాల సైనికులు
Jan 26, 2020, 11:47 am IST

న్యూఢిల్లీ

మహిళా జవాన్ల శక్తికి అద్దం పట్టిన గణతంత్ర దినోత్సవ వేడుకలు
Jan 26, 2020, 11:37 am IST

న్యూఢిల్లీ

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆకట్టుకుంటోన్న సుఖోయ్ విన్యాసాలు. గంటకు 900 కిలోమీటర్ల వేగంతో నింగిని చీల్చుకుంటూ దూసుకెళ్లిన యుద్ధ విమానాల
Jan 26, 2020, 11:32 am IST

న్యూఢిల్లీ

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆలరించిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ శకటం: ఆరేళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్ శకటానికి లభించిన చోటు
Jan 26, 2020, 11:29 am IST

ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ
Jan 26, 2020, 11:12 am IST

న్యూఢిల్లీ

గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న 49 మంది సాహస బాల బాలికలు.
Jan 26, 2020, 11:09 am IST

న్యూఢిల్లీ

గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో చూపుమరల్చుకోనివ్వని తెలంగాణ శకటం. బతుకమ్మకు అద్దం పట్టేలా రూపొందించిన శకటం
Jan 26, 2020, 11:07 am IST

న్యూఢిల్లీ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా అబ్బుర పరుస్తోన్న వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శన
Jan 26, 2020, 11:05 am IST

లఢక్

సియాచిన్‌లో మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో 17 వేల అడుగులో సగర్వంగా ఎగురుతోన్న త్రివర్ణ పతాకం
Jan 26, 2020, 11:02 am IST

అస్సాం

బంద్‌కు పిలుపునిచ్చిన ఉల్ఫా. అస్సాంలోని పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు. భారీగా మోహరించిన భద్రతా బలగాలు
Jan 26, 2020, 10:52 am IST

న్యూఢిల్లీ

సైనిక బెటాలియన్‌కు నాయకత్వం వహించిన ఆర్మీ మహిళా అధికారి తాన్యా షెర్గిల్
Jan 26, 2020, 10:48 am IST

తెలంగాణ

దేశం మొత్తానికీ రోల్ మోడల్‌గా ఆవిర్భవించిన తెలంగాణ: ఆరేళ్ల వ్యవధిలో అద్భుత ప్రగతిని రాష్ట్రం సాధిస్తోంది: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Jan 26, 2020, 10:46 am IST

తెలంగాణ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తోన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Jan 26, 2020, 10:37 am IST

తెలంగాణ

హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు
Jan 26, 2020, 10:35 am IST

తెలంగాణ

71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి
Jan 26, 2020, 10:32 am IST

ఆంధ్రప్రదేశ్

పాలనను వికేంద్రీకరించడానికి, ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లడానికి మూడు రాజధానుల ఏర్పాటు వీలు కల్పిస్తుంది: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
Jan 26, 2020, 10:31 am IST

ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటుతో పాలన వికేంద్రీకర. పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
Jan 26, 2020, 10:30 am IST

ఆంధ్రప్రదేశ్

71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రసంగిస్తోన్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+