కొత్త కరెన్సీ ప్రాణాలు తీసింది.
హర్యానా :పెద్ద నగదు నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నగదు కోసం బ్యాంకులు, ఎటిఎం ల వద్ద బారులు తీరుతూ చనిపోయిన ఘటనలు చూశాం. కాని, కాని, ప్రజలకు పైసలు ఇస్తూనే ఓ బ్యాంకు అధికారి తన ప్రాణాలను కోల్పోయాడు. పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారం అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతోంది.
పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారం కారణంగా బ్యాంకు అధికారులకు కంటి మీద కునకు లేకుండా పోయింది.బ్యాంకు సమయానికి కంటే ముందుగానే రావడం, బ్యాంకు సమయం ముగిసిన తర్వాత కూడ గంటల తరబడి బ్యాంకుల్లో పనిచేయడం బ్యాంకు ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది.

పెద్దనగదు నోట్ల వ్యవహారం హర్యానా రాష్ట్రంలో ఓ బ్యాంకు అధికారి ప్రాణాలను తీసింది. ఖాతాదారులకు డబ్బులిస్తూనే ప్రాణాలను కోల్పోయాడు.ఈ ఘటనతో బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులు కంటతడిపెట్టారు.
హర్యానా రాష్ట్రానికి చెందిన రాజేష్ కుమార్ రోహ్తక్ కో పరేటివ్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ప్రతి రోజూ ఎక్కువ సమయం బ్యాంకులోనే గడుపుతున్నాడు. అసలే ఆయనకు గుండెజబ్బు.. మూడు రోజులుగా పనిఒత్తిడి పెరిగింది. పైగా విశ్రాంతి కూడ లేదు.రాత్రి, పగలనే తేడా లేకుండా బ్యాంకులోనే గడుపుతున్నాడు బ్యాంకు మేనేజర్ బుదవారం నాడు ఉదయం పూట ఖాతాదారులకు డబ్బులు ఇస్తూ తన సీట్లనే కుప్పకూలిపోయాడు. బ్యాంకు సిబ్బంది వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన అప్పటికే చనిపోయారని వైద్యులు ప్రకటించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications