బిహార్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది: ప్రశాంత్ కిషోర్ సంచలనం
ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం ఇటీవల పట్నాలోని గాంధీ మైదానంలో సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం నితీశ్ కుమార్ తో పాటు 27 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో బీజేపీ నుంచి 14 మంది, జేడీయూ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తాజాగా బిహార్ పోల్స్ పై జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్డీయే కూటమి ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మహిళలకు రూ. 10, 000 చొప్పున అందజేశారని ఆరోపించారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి రిగ్గింగ్ చేసి విజయం సాధించిందని అన్నారు. కానీ దీనికి సంబంధించిన ఆధారాలు ప్రస్తుతం తమ దగ్గర లేవని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు పార్టీల పరంగా నెలలపాటు ఫీడ్ బ్యాక్ సమకూర్చుకున్నామని వాటి ఆధారాలు.. ఫలితాల ఆధారాలకు పొంతన లేదని స్పష్టం చేశారు. ఏదో తప్పు జరిగిందని తాను నమ్ముతున్నట్లు వివరించారు.
"చిన్నచిన్న పార్టీలకు కూడా లక్షల ఓట్లు వచ్చాయి. ఈ విజయంపై ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నా గొంతు వినిపించాలని వాళ్లు కోరుతున్నారు. ఈవీఎంలను మానిపులేట్ చేసినట్లు చెబుతున్నారు. కానీ నా దగ్గర ఆధారాలు లేవు. ఏదో తప్పు జరిగింది. కానీ అది ఏంటో తెలియదు" అని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక ఎన్నికలకు ముందు ఎన్డీయే కూటమి.. రాష్ట్రంలోని వేలమంది మహిళా ఓటర్లకు డబ్బులు పంచిందని ఆరోపించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగలేదన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక బిహార్ 243 అసెంబ్లీ సీట్లకుగాను ప్రశాంత్ కిశోర్ పార్టీ 238 సీట్లలోనూ పోటీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఒక్కసీటు గెలువలేకపోయింది.

ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ నిర్వహించారు. నవంబర్ 14 న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 243 స్థానాల్లో పోటీ చేసిన ఎన్డీయే కూటమి 202 చోట్ల గెలిచింది. ఇందులో బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ- రామ్ విలాస్ పాస్వాన్ 19, హెచ్ ఏఎం పార్టీ 5, ఆర్ ఎల్ ఎం పార్టీ 4 స్థానాల్లో గెలిచింది. రాష్ట్రంలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications