భారత్ లో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు .. తాజాగా 48,786 కొత్త కేసులు, 1,005 మరణాలు
దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 48,786 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,11,634 కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం తాజాగా కరోనా మహమ్మారి కారణంగా 1,005 మంది మరణించారు. దీంతో దేశంలోని మరణాల సంఖ్య 3,99,459 గా ఉంది.ఇదిలా ఉంటే కొత్త మ్యూటేషన్స్ భారత్ నే కాదు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. కరోనా వ్యాప్తి కట్టడి చేసే యత్నాలే మ్యూటేషన్ లను తగ్గిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

భారీగా నమోదవుతున్న రికవరీలు
కోవిడ్ -19 నుండి తాజాగా 61,588 రికవరీలు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా మహమ్మారి నుండి బయట పడిన వారి మొత్తం కేసుల సంఖ్య 2,94,88, 918 కు చేరుకుంది. ఇవి దేశంలోని మొత్తం కరోనా కేసులలో 96.97 శాతం ఉన్నాయి. యాక్టివ్ కేసులు కూడా బాగా తగ్గినట్లుగా తెలుస్తోంది.భారతదేశంలో తాజా కోవిడ్ ఇన్ఫెక్షన్లు 48,786 గా నమోదయ్యాయి, ఇది నిన్నటి కంటే ఆరు శాతం ఎక్కువగా నమోదయ్యింది.

నాలుగు లక్షలకు చేరుకున్న మరణాలు
మొత్తం మరణాల సంఖ్య 4 లక్షలకు చేరుకుంది. నిన్నటి నుండి 1,005 మరణాలు సంభవించాయి. నిన్న మరణాలు చాలా తక్కువ సంఖ్యలో నమోదుకాగా, ఈ రోజు మళ్ళీ వెయ్యికి పైగా నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 3.04 కోట్ల కేసులు నమోదయ్యాయి. దారుణ పరిస్థితులు సృష్టించిన కరోనా సెకండ్ వేవ్ పై తీవ్రమైన పోరాటం సాగించిన తరువాత, రోజువారీ రికవరీల సంఖ్య వరుసగా 49 వ రోజు రోజువారీ కేసుల సంఖ్యను మించిపోయింది. 5,23,257 క్రియాశీల కేసులతో, భారతదేశం యొక్క క్రియాశీల కేసులు మొత్తం కేసులలో ప్రస్తుతం 1.72 శాతం ఉంది.

కరోనా కేసుల నమోదు గతేడాది ఆగస్ట్ నుండి ఇలా
భారతదేశం యొక్క కోవిడ్ -19 సంఖ్య ఆగస్టు 7 న రెండు మిలియన్లు, ఆగస్టు 23 న మూడు మిలియన్లు, సెప్టెంబర్ 5 న నాలుగు మిలియన్లు మరియు సెప్టెంబర్ 16 న ఐదు మిలియన్లను దాటింది. ఇది సెప్టెంబర్ 28 న ఆరు మిలియన్లు, అక్టోబర్ 11 న ఏడు మిలియన్లు దాటింది, అక్టోబర్ 29 న 8 మిలియన్ లకు చేరుకుంది. నవంబర్ 20 న తొమ్మిది మిలియన్లు మరియు డిసెంబర్ 19 న 10 మిలియన్ల మార్కును అధిగమించింది. మే 4 న భారత్ 20 మిలియన్లు, జూన్ 23 న ముప్పై మిలియన్లు దాటింది.












Click it and Unblock the Notifications