అసహనం, దాడులు ఆర్థికవృద్ధికి ప్రతిబంధకం : ఆది గోద్రెజ్
ముంబై : ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆది గోద్రేజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాపార నిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉంటే ఆయన శనివారం ముంబైలోని ఓ కాలేజీ వార్షికోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న సిచుయేషన్పై సునిశీతంగా కామెంట్ చేశారు. దేశంలో అసహనం పెరిగిపోతుందన్నారు. కుల, మతాల పేరుతో జరుగుతున్న దాడులు ఆర్థిక ప్రగతికి అవరోధంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
పెరుగుతున్న అసహనం ..
ముంబైలోకి సెయింట్ గ్జేవియర్ కాలేజీ 150వ వార్షికోత్సవం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఆది గోద్రెజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో అసహనం పెరిగిపోతుందన్నారు. ఇది మనకు అంత మంచిది కాదన్నారు. కుల, మతాల పేరుతో జరుగుతున్న దాడులను కూడా తప్పుపట్టారు. ఈ కాలంలో కూడా వర్ణ వివక్ష ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధిపై ముందుచూపు ఉన్న ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు.

ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లు చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతించారు. దీంతో మన ఆర్థిక వ్యవస్థ రెట్టింపు అవుతుంది.. ఆనందమే కానీ ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలే ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. దీంతో సామాజిక అస్థిరత్వం ఏర్పడుతుందని హెచ్చరించారు. ఇది ఆర్థిక వృద్ధికి ప్రతిబంధకంగా మారే ప్రమాదం ఉందని అలర్ట్ చేశారు.
దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. హింస ఈ స్థాయిలో పెరగడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఇది సమాజానికి మంచిది కాదని సూచించారు. దీంతోపాటు గత నాలుగు దశాబ్ధాల్లో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగిత 6.1 శాతానికి చేరడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా వాడటం, ఆరోగ్య భద్రత లేకపోవడంపై ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో మంచినీరు దొరకని దుర్భర పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications