తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత : మాజీ గవర్నర్,
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపట్ల ఆ రాష్ట్ర మాజీ గవర్నర్, మాజీ ఏపీ ముఖ్యమంత్రి రోశయ్య సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆమెను ప్రజల ముఖ్యమంత్రిగా ఆయన అభివర్ణించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ ప్రజలే కుటుంబంగా భావించి ఆమె పాలన కొనసాగించారని అన్నారు. తాను తమిళనాడు గవర్నర్గా పనిచేసిన సమయంలో జయలలిత అందించిన సహకారాన్ని తాను ఎన్నటికీ మరిచిపోలేనని చెప్పారు.












Click it and Unblock the Notifications