ఆర్ఆర్ నగర్లో బీజేపీ-జేడీఎస్లకు కాంగ్రెస్ భారీ షాక్, ఓటమిపై సీఎం కుమారస్వామి స్పందన
బెంగళూరు: కర్ణాటకలోని ఆర్ఆర్ నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ప్రతిపక్ష బీజేపీతో పాటు మిత్రపక్షం జేడీఎస్కు గట్టి షాకిచ్చింది. బీజేపీ రెండో స్థానంలో, జేడీఎస్ మూడో స్థానంలో నిలిచాయి.
ఆర్ఆర్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న నాయుడు 80వేలకు పైగా ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి 34వేల ఓట్లు సాధించారు. మరికొన్ని రౌండ్లు లెక్కించాల్సి ఉంది. ఇప్పటికే ఫలితం తేలిపోయింది. కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుంది.

ఆర్ఆర్ నగర్ ఎన్నికల్లో జేడీఎస్ మూడో స్థానానికి పడిపోయింది. జేడీఎస్ బీజేపీకి కూడా దరిదాపుల్లో లేదు. దీనిపై ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ.. దానిని తాము పరిగణలోకి తీసుకోవడం లేదని చెప్పారు. అక్కడి ప్రజలు కేవలం బీజేపీ ఓటమిని కోరుకున్నారని తెలిపారు.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ మేఘాలయలోని అంపతిలో విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి మిలాని డీ షిరా గెలుపొందారు. ఎన్పీపీ అభ్యర్థి సిజీ మోమిన్ ఎటమి చెందారు. మహారాష్ట్రలోని పాలుస్ - ఖడేగోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కే విశ్వజీత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications