నెంబర్ వన్ బీర్లు, దెబ్బకు రూ. 25 కోట్ల కింగ్ ఫిషర్ బీర్లు సీజ్, తాగితేపోతారని !
బెంగళూరు/మంగళూరు: కింగ్ఫిషర్ బీర్లో ప్రమాదకరమైన పదార్ధం కనుగొనబడింది, యువతలో కింగ్ ఫిషర్ బీరు చాలా ఆకర్షణీయంగా మరియు ప్రజాదరణ పొందింది. దీంతో కర్ణాటకలోని మైసూరు ఎక్సైజ్ పోలీసులు రూ. 25 కోట్ల విలువైన 78,678 బీరు బాక్సులను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారుులు తెలిపారు.
మైసూరు జిల్లా నంజన్గూడ్లో యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ ఉత్పత్తి చేసిన కింగ్ ఫిషర్ బీరులో నిషేధిత పదార్థాల అవక్షేపం ఉన్నట్లు గుర్తించారు. కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రా లాగర్ బీర్, శాంపిల్ 7e బీర్లో, 7cలో నిషేదింత పదాక్థాలు ఉన్నాయని, ప కంటెంట్ కనుగొనబడింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే బీరు శాంపిల్ను కెమికల్ ల్యాబ్కు పంపించారు.

అందుకే రిటైల్లోనూ విక్రయించకుండా నిలిపివేశారు. అలాగే నాణ్యమైన బీరును ఉత్పత్తి చేయనందుకు కంపెనీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ బీరు మనుషులు తాగడానికి పనికిరాదని అంతర్గత రసాయన శాస్త్రవేత్త ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎ. రవి శంకర్ తెలిపారు.












Click it and Unblock the Notifications