Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్ టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 332 కోట్లు హుష్ కాకి, ఊపేస్తున్న అక్కచెల్లెళ్లు !

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం శక్తి పథకాన్ని అమలు చేయడంతో కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో టిక్కెట్లు లేకుండా ప్రయాణించే మహిళల సంఖ్య విపరీతంగా పెరిగింది.

మహిళా ప్రయాణికులపై నిఘా ఉంచిన రవాణాశాఖ అధికారులు టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తున్న వారిని పట్టుకుని జరిమానాలు విధిస్తున్నారు. ఆగస్టు నెలలో కేఎస్ఆర్ టీసీ అధికారులు 3,208 టికెట్ లేని ప్రయాణికులకు జరిమానా విధించింది. టిక్కెట్‌ లేని ప్రయాణికుల సంఖ్య ప్రతినిత్యం పెరుగుతుండడంతో రవాణా శాఖ దర్యాప్తు బృందాలు తనిఖీలు ముమ్మరం చేసింది.

 Rs 332.77 crores were spent as women travel free on KSR TC buses in Karnataka.

కార్పొరేషన్ పరిధిలో తిరుగుతున్న 44, 416 వాహనాలపై అధికారులు విచారణ చేపట్టారు. వీరిలో 3,208 మంది ప్రయాణికుల నుంచి రూ.4, 70,801 జరిమానా వసూలు చేశారు. కేఎస్ఆర్ టీసీలోని కొందరు ఉద్యోగు కారణం సంస్థకు నష్టం వస్తోందని అధికారులు గుర్తించారు. బాధ్యులపై శాఖాపరమైన తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

కేఎస్ ఆర్ టీసీ బస్సులో ప్రయాణించేటప్పుడు చెల్లుబాటు అయ్యే టికెట్ లేదా పాస్ పొందాలని కేఎస్ఆర్ టీసీ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే శక్తి పథకం ప్రవేశపెట్టి మూడు నెలలు పూర్తి అయ్యింది. ఇప్పటివరకు 13. 20 కోట్ల మంది మహిళలు కేఎస్ఆర్ టీసీ, బీఎంటీసీ బస్సుల్లో జీరో టిక్కెట్లు పొంది ఉచితంగా ప్రయాణించారని అధికారులు అంటున్నారు.

జీరో టికెట్ లపై మహిళలు ఉచితంగా ప్రయాణించడంతో మొత్తం రూ. 332.77 కోట్లు ఖర్చు అయ్యిందని అధికారులు అంటున్నారు. వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ పరిధిలోని ధారవాడ, బెళగావి, బాగల్‌కోట్, గదగ్, హావేరి, ఉత్తర కన్నడ జిల్లాల్లోని 9 రవాణా విభాగాల్లో మూడు నెలల వ్యవధిలో 13,20,53,266 మంది మహిళలకు జీరో టిక్కెట్‌లను జారీ చేశారు.

 Rs 332.77 crores were spent as women travel free on KSR TC buses in Karnataka.

ఇంత మంది మహిళలు ఉచితంగా ప్రయాణించడంతో ఉచిత ప్రయాణ టిక్కెట్ ప్రయాణం ఖర్చు రూ. 332, 77, 03, 789 అయ్యిందని సంబంధిత అధికారులు అంటున్నారు. జూన్ 11 నుంచి 30 వరకు 2. 55 కోట్ల మంది మహిళలు జీరో టిక్కెట్లు పొంది ఉచితంగా ప్రయాణించారు. ప్రయాణ టిక్కెట్ మొత్తం రూ. 65.15 కోట్లు అయ్యింది. జూలై నెలలో 4. 48 కోట్ల మంది మహిళలు జీరో టిక్కెట్లు పొంది ఉచితంగా ప్రయాణించారు.

ప్రయాణ టిక్కెట్ మొత్తం రూ. 111.78 కోట్లు అయ్యింది. ఆగస్టు నెలలో 4.61 కోట్ల మంది మహిళలు జీరో టిక్కెట్లు పొంది ఉచితంగా ప్రయాణించారు. ప్రయాణ టిక్కెట్ మొత్తం రూ. 115.42 కోట్లు అయ్యింది. సెప్టెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు 1. 56 కోట్ల మంది మహిళలు జీరో టిక్కెట్లు పొంది ఉచితంగా ప్రయాణించారు. ప్రయాణ టిక్కెట్ మొత్తం రూ. 40.42 కోట్లు అయ్యిందని సంబంధిత అధికారులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+