రూ. 34 వేల కోట్ల స్కాం: డీహెచ్ఎఎఫ్ఎల్ డైరెక్టర్ ధీరజ్ అరెస్ట్
న్యూఢిల్లీ: రూ. 34,000 కోట్ల మోసం కేసులో డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (CBI) మంగళవారం అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో హాజరు పర్చగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పలు బ్యాంకులకు రూ. 34,000 కోట్ల మోసం కేసులో గతంలోనే ఆయన అరెస్ట్ అయ్యారు.
అయితే, 2022, డిసెంబర్లో డిఫాల్ట్ బెయిల్ మంజూరైంది. సీబీఐ ఛార్జీషీట్ అసంపూర్తి ఉందన్న ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. తాజాగా, ధీరజ్ వాధ్వాన్ ను సీబీఐ ముంబైలో అరెస్ట్ చేసింది. అనంతరం ఢిల్లీ కోర్టులో హాజరుపర్చగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

కాగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియం ఇచ్చిన ఫిర్యాదుపై 2022, జూన్లో సీబీఐ ఆయనను అరెస్ట్ చేసింది. బ్యాంకులను మోసం చేసిన కేసులో ధీరజ్ను అరెస్ట్ చేసింది. నిధులను స్వాహా చేసేందుకు అనేక షెల్ కంపెనీలను సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అంతేగాక, లావాదేవీలను దాచడానికి పుస్తకాలను తప్పుగా మార్చినట్లుగా గుర్తించారు. తాజాగా ధీరజ్, అతని సోదరులకు లభించిన డిఫాల్ట్ బెయిల్ రద్దు కావడంతో వారిని సీబీఐ అరెస్ట్ చేసింది. 2023, డిసెంబర్ 8న యెస్ బ్యాంక్ కేసులో ఆరోగ్య కారణాలతో ధీరజ్ మధ్యంతర బెయిల్ పొందారు. బాంబే హైకోర్టు ఈ మధ్యంతర బెయిల్ను మే 2న సాధారణ బెయిల్గా మార్చింది. ఆ తర్వాత తాజాగా ఆయనను అరెస్ట్ చేసింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications