శశికళ ఎఫెక్ట్: డీఐజీ రూప మీద రూ. 50 కోట్లకు పరువునష్టం దావా, నోటీసులు ఇచ్చిన డీజీపీ !
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ దగ్గర రూ. 2 కోట్లు లంచం తీసుకున్న డీజీపీ సత్యనారాయణ రావ్.
బెంగళూరు: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ దగ్గర రూ. 2 కోట్లు లంచం తీసుకున్న డీజీపీ సత్యనారాయణ రావ్ ఆమెకు వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని డీఐజీ రూప ఆరోపించారు.
డీఐజీ రూప చేసిన ఆరోపణలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డీజీపీ సత్యనారాయణ రావ్ న్యాయవాది పుత్తిగే ఆర్. రమేష్ డీఐజీ రూపకు నోటీసులు జారీ చేశారు. డీజీపీ సత్యనారాయణ రావ్ కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పడానికి డీఐజీ రూపకు మూడు రోజులు గడువు ఇచ్చారు.

బహిరంగ క్షమాపణ
తన కక్షిదారుడు డీజీపీ సత్యనారాయణ రావ్ ఎవ్వరి దగ్గర లంచం తీసుకోకపోయినా డీఐజీ రూప అనవసరంగా ఆరోపణలు చేశారని, ఆయన పరువుకు భంగం కలిగే విధం మాట్లాడారని, అందుకు మూడు రోజుల్లోగా ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులు పంపించారు.
Recommended Video


రూ. 50 కోట్లకు పరువునష్టం దావా !
డీజీపీ సత్యనారాయణ రావ్ కు మూడు రోజుల్లోగా డీఐజీ రూప బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే రూ. 50 కోట్లకు పరువునష్టం దావా వేస్తామని ఆయన న్యాయవాది రమేష్ అన్నారు. అనవసరంగా తన సీనియర్ అధికారి మీద ఆరోపణలు చేసిన డీఐజీ రూపను కచ్చితంగా కోర్టుకు లాగుతామని హెచ్చరించారు.

దేశ వ్యాప్తంగా తెలిసింది
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని, ఆమె కుటుంబ సభ్యుల దగ్గర డీజీపీ సత్యనారాయణ రావ్ రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ డీఐజీ రూప పై అధికారులు, ప్రభుత్వానికి లేఖ రాయడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిందని న్యాయవాది రమేష్ అన్నారు.

డీజీపీ గౌరవం ఏం కావాలి ?
అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లిన విషయం దేశవ్యాప్తంగా తెలిసింది. అలాంటి శశికళ విషయంలో డీఐజీ రూప సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ జైల్లో శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారని, డీజీపీ సత్యనారాయణ రావ్ లంచం తీసుకున్నారని మాట్లాడుకోవడంతో ఆయన గౌరవానికి భంగం కలిగిందని న్యాయవాది రమేష్ చెప్పారు.

రూప ఏం చెబుతారు ?
డీజీపీ సత్యనారాయణ రావ్ న్యాయవాది రమేష్ పంపించిన నోటీసులు తనకు అందాయని కానీ, అందలేదు అని కానీ ఇంత వరకు డీఐజీ రూప చెప్పలేదు. డీజీపీ సత్యనారాయణ రావ్ పంపించిన నోటీసులకు డీఐజీ రూప ఏం సమాధానం చెబుతారో ? అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications