మరోసారి: కర్నాటకలో భారీగా రూ.2వేల నోట్ల కరెన్సీ స్వాధీనం
కర్నాటక రాజధాని బెంగళూరు సమీపంలో మరోసారి ఆదాయపన్ను శాఖ అధికారులు పెద్ద మొత్తంలో డబ్బులను స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరు సమీపంలో మరోసారి ఆదాయపన్ను శాఖ అధికారులు పెద్ద మొత్తంలో డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. కర్నాటకలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా తాజాగా, భారీస్థాయిలో కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు 32 కి.మీ. దూరంలోని బైలూరు వద్ద ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.71లక్షల విలువైన రూ.2000 నోట్లను గుర్తించారు.

ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కర్ణాటకలో ఇటీవల భారీస్థాయిలో కరెన్సీ లభ్యమవుతోంది. శనివారం బెంగళూరు, తుమకూరు, మడికేరిల్లో వేర్వేరుచోట్ల చేపట్టిన తనిఖీల్లో రూ.74.50లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
దీనిపై ఉడుపి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటీ బాలకృష్ణ మాట్లాడుతూ.. రూ.71 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముగ్గురి నుంచి గుర్తించామన్నారు. వారంతో ఓ కారులో కొత్త రూ.2వేల నోట్లు తీసుకు వస్తున్నారని తెలిపారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications