బ్లాక్ మనీ? రూ. 71 లక్షల రూ.2,000 నోట్లు సీజ్
ఉడిపి: అక్రమంగా తరలిస్తున్న రూ. 71 లక్షల రుపాయల( అన్నీ రూ. 2,000 నోట్లు)ను ఉడిపి జిల్లాలోని కర్కాళ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళూరులోని కుద్రోళి ప్రాంతానికి చెందిన ఇమ్రాన్, ఆసీఫ్, దీపక్ అనే ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
శుక్రవారం కేఏ-19ఎంఏ, 7639 నెంబర్ ఉన్న ఫోర్డ్ కారులో నిందితులు వాయువేగంగా వెలుతున్న సమయంలో పోలీసులు వారిని వాహనం నిలపాలని సూచించారు. అయితే ఆముగ్గురు కారులో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు.

పోలీసులకు అనుమానం వచ్చి వారిని వెంబడించారు. కారు అడ్డుకుని వాహనంలో క్షుణ్ణంగా పరిశీలించారు. కారులో రూ. 71 లక్షల విలువైన రూ. 2,000 నోట్లు కనపడటంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల దగ్గర నగదుకు సంబంధించి ఎలాంటి దృవీకరణ పత్రాలు లేవని, నిందితులు ముగ్గురు పొంతనలేని సమాధానం ఇస్తున్నారని కార్కాళ పోలీసు అధికారి జాన్ ఆంటోని చెప్పారు. నిందితులను అరెస్టు చేసి రూ. 71 లక్షలు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులకు అప్పగించామని పోలీసు అధికారి జాన్ ఆంటోని తెలిపారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications